Jhanvi Kapoor: సినీ ఇండస్ట్రీలో శ్రీదేవి వారసురాలిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి జాన్వీ కపూర్. ఒకప్పుడు ఈమె బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఉండేవారు అయితే ప్రస్తుతం తెలుగులో కూడా సినిమా అవకాశాలను అందుకుంటూ వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా నటిగా కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె ఎక్కువగా గుళ్లు గోపురాలు అంటూ ఆలయాలను సందర్శించడమే కాకుండా మన హిందూ సాంప్రదాయాలను కూడా ఎంతో చక్కగా పాటిస్తారు అనే విషయాలు మనకు తెలిసినదే.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి జాన్వీ ఆసక్తి కరమైన విషయాలను వెల్లడించారు. తన తల్లి శ్రీదేవి ఎన్నో మతపరమైనటువంటి ఆచార వ్యవహారాలను పాటించేవారు.
అమ్మ ఉన్నప్పుడు తాము ఇలాంటి పద్ధతులను అసలు పాటించే వాళ్ళం కాదని తెలిపారు. కానీ అమ్మ చనిపోయిన తర్వాత అమ్మ పాటించే కొన్ని కట్టుబాట్లను తాను కూడా పాటిస్తున్నానని తెలిపారు. అమ్మ ఉన్నప్పుడు శుక్రవారం ఎట్టి పరిస్థితులలో కూడా జుట్టు కత్తిరించేది కాదు అలా చేయటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాదని చెప్పేవారు. అప్పుడు మేము ఈ మాటలను కొట్టి పారేసే వాళ్ళం కానీ ఇప్పుడు తాను శుక్రవారం జుట్టు కట్ చేయనని తెలిపారు.
తిరుమల శ్రీవారు..
ఇకపోతే శుక్రవారం ఎప్పుడూ కూడా నలుపు రంగు దుస్తులను ధరించకూడదని అమ్మ చెప్పేది తాను ఇప్పటికీ కూడా ఈ విషయాన్ని ఫాలో అవుతూ ఉన్నానని జాన్వీ తెలిపారు. ఇక అమ్మ ఎప్పుడు తిరుమల శ్రీవారిని నారాయణ నారాయణ నారాయణ అంటూ తలుచుకుంటూ ఉండేది. ప్రతి ఏడాది తన పుట్టినరోజు అమ్మ తిరుపతి వెళ్ళేది అమ్మ చనిపోయిన తర్వాత తన పుట్టినరోజు నాడు మేము వెళ్లాలని నిర్ణయించుకున్నాము అంటూ ఈ సందర్భంగా జాన్వీ కపూర్ చేస్తున్న ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి



























