JD Lakshminarayana: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు ఈయన జగన్ కేసులలో కీలకంగా వ్యవహరించారు. ఇలా జగన్ వ్యవహారాలతో ఎంతో పాపులారితే సంపాదించుకున్న లక్ష్మీనారాయణ త్వరలోనే నటుడిగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఈయన నటించిన భీమదేవరపల్లి బ్రాంచి అనే సినిమా త్వరలోనే విడుదల కానుంది.

రమేష్ చెప్పాల దర్శకత్వంలో ఏబీ సినిమాస్, నిహాల్ ప్రొడక్షన్స్ పతాకాలపై బత్తిని కీర్తిలత గౌడ్, రాజా నరేందర్ చెట్లపెల్లి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.ఇప్పటికే షూటింగ్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాలో జెడి లక్ష్మీనారాయణతో పాటు రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఓ కీలక పాత్రలో నటించడంతో ఈ సినిమాపై ప్రతి ఒక్కరికి ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో ప్రొఫెసర్ నాగేశ్వర్ నటిస్తున్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఇదివరకు ఎంతోమంది దర్శక నిర్మాతలు వెళ్లి నాగేశ్వరరావును సినిమాలలో నటించమని సంప్రదించిన ఆయన నటించడానికి ఆసక్తి చూపలేదు.

JD Lakshminarayana: నటుడిగా మారిన రాజకీయ విశ్లేషకులు..
అయితే ఇటీవల కాలంలో జరిగిన ఒక సంఘటన భారతదేశంలో సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో ప్రతి ఒక్క పాత్ర సహజంగా ఉండడం కోసమే జేడీ లక్ష్మీనారాయణ ప్రొఫెసర్ నాగేశ్వరరావు సంప్రదించగా వారు కూడా నటించడానికి ఆసక్తి చూపారు. అయితే త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని కూడా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.



























