Ramoji Rao: రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అనారోగ్య సమస్యలతో నేడు మరణించిన సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నటువంటి ఈయన నిన్న మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకి గురి అయ్యారు. ఇలా ఈయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ ఉన్న రామోజీరావు నేడు ఉదయం 4:30 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. ఇక ఈయన మరణించారనే వార్త తెలియడంతో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమ అలాగే మీడియా రంగం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. మీడియా రంగానికి ఎనలేని సేవలు చేసిన రామోజీరావు చలనచిత్ర పరిశ్రమకు కూడా ఎన్నో అద్భుతమైన సేవలు అందించారు.
ఇక నిర్మాతగా కూడా ఈయన ఎంతో మంచి విజయాలను సొంతం చేసుకున్నారు. ఇక రామోజీరావు మరణం పై అటు రాజకీయ నాయకులు ఇటు సినీ నిర్మాతలు స్పందించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇకపోతే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం రామోజీరావు మృతి పై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.
లోటు పూడ్చలేనిది…
శ్రీ రామోజీ రావు గారు లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరు. మీడియా సామ్రాజ్యాధినేత మరియూ భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. ఆయన మన మధ్యన ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. ‘నిన్ను చూడాలని’ చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికి మరువలేను. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు.



























