గతంలో ఎన్నడూ లేని విధంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్లో భారీగా వరదలు సంభవించాయి. లోతట్టు ప్రాంతాలు అన్నీ జలమయం అయ్యాయి. ఎక్కడ చూసినా.. చెట్లు, భవనాలు నేలమట్టం అయ్యాయి.

దీంతో అక్కడ జనజీవనం అంతా స్తంభించింది. చిత్తూరు, కడప జిల్లాల్లో ఈ వర్ష ప్రభావం భారీగా ఉంది. దీంతో తిరుమల దేవస్థానం అధికారులు దయచేసి దర్శనానికి వచ్చే వాళ్లు వాయిదా వేసుకోవాలని.. వచ్చే ఆరు నెలల్లో ఎప్పుడైనా మీ దగ్గర ఉన్న టికెట్ల సహాయంతో దర్శణం చేసుకోవచ్చు అంటూ తెలిపారు. ఇక అక్కడ కొన్ని గ్రామాల్లో కరెంట్ లేక.. తాగడానికి నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అక్కడి రహదారులు అయితే కాలువలను తలపిస్తున్నాయి. వీటంన్నింటిన చూసి జూనియర్ ఎన్టీఆర్ చలించిపోయారు. వరదల వల్ల నష్టపోయిన ప్రజల కష్టాలను చూసి బాధపడ్డారు. ఈ పరిస్థితి వేరొకరికి రాకూడదని.. ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. తన వంతుగా అతడు రూ.25 లక్షల విరాళాన్ని ప్రకటించాడు. దీనికి సంబంధించి ట్విట్టర్ లో ఇలా ట్వీట్ చేశాడు.
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల సంభవించిన వరదల వల్ల ప్రభావితమైన ప్రజల కష్టాలను చూసి చలించి.. వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ.. తన వంతుకుగా రూ. 25 లక్షల రూపాయలను అందిస్తున్నాను’’ అని రాశారు. అతడితో పాటు ప్రిన్స్ మహేశ్ బాటు కూడా రూ.25 లక్షలను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. వీరిద్దరు వారి సహాయార్థం ఆ విరాళాన్ని ఆంధ్రప్రదేశ్ సిఎం రిలీఫ్ ఫండ్కు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.


























