KA Paul : గ్లోబల్ పీస్ మేకర్ గా అందరికీ తెలిసిన పాల్ పుట్టింది ఆంధ్రప్రదేశ్ చిట్టివలస గ్రామం. పదవ తరగతి కూడా పూర్తి కాని పాల్ మత ప్రచారకుడిగా తన తండ్రితో కలిసి వెళ్తూ అలా గోస్పల్ ఫౌండేషన్ లో అన్నీ తానై క్రిస్టియానిటీ బోధకుడిగా మారారు. తన ఎనిమిదవ ఏట క్రిస్టియనిటీ స్వీకరించిన కే ఆనంద్ పాల్ ఆ తరువాత దేశ విదేశాలలో అగ్ర నాయకులను కలిసి సేవా కార్యక్రమాలకు నిధులను సమాకుర్చుకునేవాడు. ఆయన పీస్ మేకర్ గా అగ్ర నాయకులతో మాట్లాడి ఎన్నో యుద్దాలను జరగకుండా ఆపేసారు అంటూ ఆయన గురించి చెబుతారు. ఎన్నో లక్షల కుటుంబాలకు వారి ఫౌండేషన్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో చదువు, ఆరోగ్య సేవలు ఇలా అందిస్తున్న కేఏ పాల్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మీద ఫోకస్ చేసారు. పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. ఇక నేటి రాజకీయాల గురించి నాయకుల గురించి తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడారు.

ఎంతో మంది విద్యార్థులను చదివిస్తున్నా…
కేఏ పాల్ గారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను చేస్తున్న సామాజిక సేవ గురించి వివరించారు. ఆయన ప్రజాశాంతి పార్టీ ద్వారా పాలిటిక్స్ లోకి అడుగుపెట్టారు. అయితే కేఏ పాల్ గారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు కుటుంబ పాలన గురించి మాట్లాడుతూ రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మీద విమర్శలను గుప్పించారు.

తనని రోల్ మోడల్ గా తీసుకుని అందరూ పనిచేయాలని తాను ఏమీ లేకుండా వచ్చి నేడు బోయింగ్ విమానం ఉన్న ఏకైక వ్యక్తిని అయ్యానంటూ తాను ఎంతో మంది విద్యార్థులను చదివిస్తున్నట్లు తెలిపారు. ఒక విద్యార్ధికి 10 సంవత్సరాలకు 10 లక్షలు చదువుకు అవుతుందంటే నేను అలా ఎంతో మందిని చదివిస్తున్నానని తెలిపారు. ఇద్దరు వితంతువులతో మొదలయిన నా సామాజిక సేవ నేడు మూడు లక్షల మందికి చేస్తున్నట్లు తెలిపారు.































