Kajal Agarwal: సినీ ఇండస్ట్రీలో నటిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి కాజల్ అగర్వాల్ ఒకరు. ఈమె ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరస సినిమాలలో నటిస్తున్నారు. త్వరలోనే శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో నటించిన సత్యభామ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఈమె పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు లేడీ ఓరియంటెడ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమా జూన్ 7 న విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర ఉన్న సమయంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.
ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు నెట్ ప్లిక్స్ ఓపెన్ చేసి మేజర్ సినిమా చూశానని తెలిపారు. ఈ సినిమాలో తాను లీనమైపోయానని నాకు తెలియకుండానే బాగా ఏడుస్తున్నానని తెలిపారు.
మేజర్ సినిమా..
ఇలా ఈ సినిమా చూసిన తర్వాత వెంటనే ఫారిన్ లో ఉన్నటువంటి తన భర్తకు ఫోన్ చేసి నేను శశికిరణ్ తిక్క దర్శకత్వంలో సినిమా చేయాలనుకుంటున్నానని తెలిపాను. అయితే భగవంత్ కేసరి సినిమా షూటింగ్ సమయంలో కిరణ్ సత్యభామ సినిమా కథతో నా వద్దకు వచ్చారు. కేవలం వారికి ఒక గంట సమయం మాత్రమే ఇచ్చాను కానీ ఆ సినిమా కథ చెబుతున్నప్పుడు లీనమైపోయి మూడు గంటల పాటు స్టోరీ విన్నానని ఈ సందర్భంగా కాజల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.



























