Kakinada Shyamala : కాకినాడ నుండి రావడం మూలంగా కాకినాడ శ్యామలగా బాగా పేరు తెచ్చుకున్న నటి శ్యామల గారు మొదట నాటకరంగంలో ప్రవేశించారు. చిన్నతనం నుండి సింగర్ కావాలని అనుకున్న శ్యామల అనూహ్యంగా నాటకరంగంలోకి వచ్చి చింతామణి, ప్రమీల వంటి నాటకాలతో మంచి గుర్తింవు తెచ్చుకుంది. ఇక అలా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన శ్యామల మొదట బాలచందర్ గారి మరో చరిత్ర సినిమాలో తల్లి పాత్ర పోషించారు. ఇక ఆతరువాత ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, తరంగిణి ఎలా సుమారు 200 కు పైగా సినిమాల్లో నటించిన ఆమె 90 లలో నటనకు గుడ్ బై చెప్పి వెండితెర, బుల్లితెర కు దూరంగా ఉన్నారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కనిపించిన శ్యామల గారు ఇండస్ట్రీ గురించి ఇంకా రాజకీయాల గురించి వివరించారు.

ప్రజల డబ్బునే పంచిపెడుతూ అభివృద్ధి అంటున్నాడు…
కాకినాడ శ్యామల గారు మొదట రాజకీయాల్లోకి రావాలనుకుని కాంగ్రెస్ లో చేరాలని అనుకుని చివర్లో నాకు రాజకీయాలు సెట్ కావు నేను ఇమడ లేనని భావించి వెళ్ళలేదట. అయితే ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లాడుతూ మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలని, ఏపీ అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు రావాలంటూ చెప్పారు.

జగన్ పాలన బాగోలేదని, వస్తే నవరత్నాలు ఇస్తాడు ఏదో చేస్తాడు అని ఓటేసిన అందరినీ మోసం చేసాడు అంటూ చెప్పారు. ప్రజల నుండి తీసుకున్న డబ్బులో కొంత ప్రజలకే పంచిపెడుతూ అభివృద్ధి అంటే ఎలా. నీ సొంత డబ్బు ఏమైనా ఖర్చు పెడుతున్నావా, అయినా ఉచితాలు ఇస్తూ పోతే రాష్ట్ర అభివృద్ధి ఏమి కావాలి అంటూ అభిప్రాయపడ్డారు.


































