Kallu chidhambharam : ఆయన కళ్ళతో హాస్యం పలికించే నటుడు. డిఫరెంట్ గా ఉండే కళ్ళు ఆయనకు పుట్టుకతో అలా వచ్చినవి కాదు, ఒకవైపు నాటకాలు వేస్తూ మరో వైపు వైజాగ్ పోర్ట్ ట్రస్ట్ లో ఉద్యోగం చేస్తూ రెండింటిని మేనేజ్ చేస్తున్న సమయంలో నిద్ర లేకపోవడంతో కళ్ళు అలా మారాయట. అయితే ఆ కళ్ళే ఆయనకి సినిమాల్లో అవకాశాలను తెప్పించాయి. ఎంతో మంది అభిమానులను సంపాదించి పెట్టాయి. ఇక ఆయన మరణించి ఇంత కాలం అయినా సినిమాల ద్వారా అందరినీ అలరిస్తున్న ఆయన గురించి అయన పిల్లలు తాజాగా యూట్యూబ్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

మిస్ యూ నాన్న…
కళ్ళు చిదంబరం గారికి నలుగురు సంతానం కాగా అందులో ఇద్దరు కవల పిల్లలు. రామకృష్ణ, సులక్షణ గార్లు రెండు నిమిషాల తేడా తో పుట్టినవారు తమ తండ్రి నటించిన సినిమాల్లో హాస్యాన్ని ఇప్పటికీ అశ్వదిస్తున్నాం అంటూ చెప్పారు. ఆస్తులు సంపాదించడం కాదు గొప్ప పేరు సంపాదించుకోవడం ముఖ్యమని ఎప్పుడూ నాన్న చెప్పేవారంటూ వాళ్ళు పంచుకున్నారు. ఇక ఆయన కళ్ళకు ఆపరేషన్ చేస్తే సరిగా అయిపోతాయి అని తెలిసినా చిన్న సర్జరీ అని తెలిసినా ఆయన చేయించుకోలేదట. ఈ కళ్ళ వల్ల ఎంతో మంది నవ్వుతున్నపుడు అభిమానిస్తున్నపుడు ఎందుకు ఆపరేషన్ చేయించుకుని సరి చేసుకోవాలి అంటూ చెప్పేవారట.

సేవా భావం ఎక్కువగా ఉండేది నాన్న గారికి అంటూ చాలా త్వరగా ఆయన మా నుండి దూరం అయ్యారు ఇంకా మాతో ఉండుంటే బాగుండేది అంటూ కూతురు సులక్షణ ‘మిస్ యూ నాన్న’ అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇక ఆయన నటించిన అమ్మోరు సినిమాలో షూటింగ్ అయ్యాక మేకప్ తీసేయకుండా అలానే వచ్చేసరికి భయపడ్డామని కూతురు చెప్పారు. ఆ సినిమా నాన్న గారికి ‘కళ్ళు’ సినిమా తరువాత అంత మంచి పేరు తెచ్చిందని చెప్పారు. ఇక అమాయకంగా నటించి హాస్యం పండించిన ఆ ఒక్కటి అడక్కు, ఒట్టేసి చెబుతున్న వంటి సినిమాల్లో పాత్రలు బాగా నచ్చుతాయంటూ పేర్కొన్నారు.






























