Connect with us

Featured

కార్తీక్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్న మోనిత.. పెళ్లి చేసుకోకపోతే అందరిని చంపేస్తా అంటూ..

Published

on

బుల్లితెరలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మొత్తం ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో సాగుతుంది. పైగా రేటింగ్ కూడా ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది. మోనిత కార్తీక్, దీపలను ఏం చేస్తుందో అని తెగ టెన్షన్ పడుతున్నారు అభిమానులు.

ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్స్ ఏమిటో చూద్దాం. కార్తీక్ ను హాస్పిటల్లో చేర్పించడం.. మోనిత వచ్చి తన అసలు రూపాన్ని బయట పెట్టడం చూసాం. ఇక కార్తీక్ మోనితను చూసి షాక్ అవుతూ.. కోపంతో రగిలిపోతాడు. కార్తీక్ దగ్గర కూర్చొని తన ప్రేమ గురించి మాట్లాడుతుంది.

ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్స్ ఏమిటో చూద్దాం. కార్తీక్ ను హాస్పిటల్లో చేర్పించడం.. మోనిత వచ్చి తన అసలు రూపాన్ని బయట పెట్టడం చూసాం. ఇక కార్తీక్ మోనితను చూసి షాక్ అవుతూ.. కోపంతో రగిలిపోతాడు. కార్తీక్ దగ్గర కూర్చొని తన ప్రేమ గురించి మాట్లాడుతుంది.

నీకోసం ఎందుకు ఈ నేరాలు చేస్తున్నాను అంటూ ఇదంతా ప్రేమ కోసమే అని.. తను చేసిన ప్లాన్స్ గురించి కార్తీక్ తో మొత్తం చెబుతుంది. ఇక తనను విడిపిస్తాను అంటూ అందుకు పెళ్లి చేసుకోవాలి అంటూ క్రూరంగా మాట్లాడుతుంది.

మోనిత మాట్లాడుతున్న మాటలకు కార్తీక్ కోపంతో రగిలిపోతాడు. ఇక బయట దీపా లోపలికి రావడానికి ప్రయత్నిస్తుండగా రత్న సీత వద్దు అంటూ గట్టిగా చెప్పేసరికి దీప బాగా ఏడుస్తూ కుమిలిపోతుంది.

ఇక మోనిత కార్తీక్ కోసం లొంగి పోతాను అంటూ.. తిరిగి వచ్చాక పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందామని తెగ కబుర్లు చెబుతుంది. ఇక కార్తీక్ మాత్రం కోపంతో రగిలిపోతాడు. తన గురించి రోషిణికి చెప్పోదంటూ గన్ తో షూట్ చేసుకుంటానని బ్లాక్ మెయిల్ చేస్తుంది.

తను తెచ్చిన కొన్ని ప్రూఫ్ లను చూపిస్తూ.. వీటిని చూపిస్తే జీవితాంతం జైలులో ఉండాల్సి ఉంటుంది అంటూ..కానీ అలాంటి పనులు చేయను అంటుంది. ఇక తనని పెళ్లి చేసుకోకపోతే ఇంట్లో వాళ్ళను చంపేస్తాను అంటూ బెదిరిస్తూ కార్తీక్ కట్టిన కట్టులు తీసేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది.

ఇక బయట దీపను చూసి అక్కడనుంచి వెళ్ళిపోదాం అనేసరికి దీప మోనిత దగ్గరికి వెళ్లి ఏం జరిగింది అని ప్రశ్నిస్తోంది. మోనిత ఫుడ్ పాయిజన్ చెప్పేసరికి షాక్ అవుతుంది దీప. ఇక తన భర్త దగ్గరికి వెళ్లడానికి పర్మిషన్ అడుగుతుంది.

దీప కార్తీక్ దగ్గరికి వెళ్లి డాక్టర్ బాబు అని ఎంత పిలిచినా కార్తీక్ షాక్ లో ఉంటాడు. ఇక తేరుకొని దీప చూసి ఎమోషనల్ గా ఏం కాలేదు కదా అంటూ ఇక్కడికి ఎందుకు వచ్చావంటూ హగ్ చేసుకుంటాడు. ఇక మోనిత గురించి చెప్పాలని అనుకునేసరికి మోనిత మాటలు గుర్తుచేసుకొని చెప్పలేకపోతాడు.

కార్తీక్ నాకేమైనా అవుతుందేమోనని భయపడుతూ మోనితను ఉద్దేశించి మాట్లాడగా.. దీప తను చేసిన ఫుడ్ వల్లే ఇలా జరిగింది అంటూ ఎమోషనల్ అవుతుంది. ఇంకేం కాదు అని ఆ డాక్టర్ చెప్పింది అని దీప అనడంతో కార్తీక్ షాక్ అవుతాడు.

తరువాయి భాగంలో కార్తీక్ మోనిత మాటలను గుర్తు చేసుకొని నో అనేసరికి..దీప షాక్ అవుతూ డాక్టర్ బాబు ఏం జరిగిందో అంటూ ఆలోచనలో పడగా కొత్త గెటప్ లో వచ్చిన మోనితను తలుచుకుంటుంది.

Advertisement

Featured

Ramcharan: రామ్ చరణ్ ఆ ఇంట్రడక్షన్ సీన్ నిజం కాదా… ఇంత పెద్ద మోసం చేశారా?

Published

on

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చినటువంటి చరణ్ తండ్రికి మించిన తనయుడు అనే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు.

ఇక రాంచరణ్ సినిమాలలో రంగస్థలం సినిమా కూడా ఓ మైలురాయిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఈయన నటన అద్భుతం అని చెప్పాలి సుకుమార్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక సాధారణ వ్యక్తి లాగా సైకిల్ తొక్కుతూ ఎంట్రీ ఇచ్చారు ఈ విషయం గురించి సుకుమార్ గారికి ఒక ప్రశ్న ఎదురైంది.

ఇలా ఒక స్టార్ హీరోని ఇంత సింపుల్గా చూపించడంతో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయం మీలో కలగలేదా అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ..కథకి అనుగుణంగా ఒక వ్యక్తి ఏదో వెతుక్కుంటూ వెళతాడు. ఆ రోజుల్లో వాహనం అంటే సైకిల్.. అందుకే సైకిల్ లో చూపించా.లాంగ్ షాట్ లో వంతెనపై సైకిల్ తొక్కుతూ కనిపించాలి. ఆ తర్వాత టాప్ యాంగిల్ లో చూపిస్తూ నెమ్మదిగా రాంచరణ్ ముఖం దగ్గరికి కెమెరా రావాలి. కాబట్టి ఫ్లైయింగ్ కెమెరా వాడాం.

Advertisement

నాలుగైదు టేకులు..
నాలుగైదు టేకులు చేసిన మంచిగా రాకపోవడంతో ఇక ఈ ఇంట్రడక్షన్ సీన్ సీజీ వర్క్ లో పూర్తి చేశాం అని సుకుమార్ చెప్పారు. అవునా అది సీజీ షాటా అని ఆశ్చర్యపోయారు. రాంచరణ్ సైకిల్ తొక్కుతున్నది మాత్రం రిఫరెన్స్ గా తీసుకుని ఆ సీన్ ని సీజీ వాళ్ళు పర్ఫెక్ట్ గా చేశారు. సినిమాలో ఇంకా కొన్ని సీజీ షాట్స్ ఉన్నాయి. కానీ ఎవరూ గుర్తు పట్టలేరు అని సుకుమార్ నవ్వేశారు. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Venu: బాహుబలి సినిమా చేస్తున్నావా.. వేణు ఇన్ని అవమానాలు పడ్డారా?

Published

on

Venu: జబర్దస్త్ కమెడియన్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వేణు దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. ఈయన బలగం అనే సినిమా ద్వారా దర్శకుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా ఎన్నో అంతర్జాతీయ అవార్డులను కూడా అందుకున్నాయి అంటే ఈ సినిమా ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో స్పష్టంగా తెలుస్తుంది. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వేణు తదుపరి సినిమా నానితో చేసే అవకాశాన్ని అందుకున్నారు త్వరలోనే వీరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించిన విషయాలు తెలియచేయబోతున్నారు.

ఇలా దర్శకుడిగా మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నటువంటి వేణు మరొక కమెడియన్ ధనరాజ్ తో కలిపి ఇటీవల ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి హాజరయ్యారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది ఈ ప్రోమోలో భాగంగా బలగమా సినిమా గురించి ప్రశ్నలు వేశారు.

Advertisement

ఈ సందర్భంగా వేణు సమాధానం చెబుతూ తాను బలగం సినిమా షూటింగ్ సమయంలో కొంతమంది టెక్నీషియన్ లతో మాట్లాడుతూ ఉండగా కొందరు నన్ను అవమానపరిచారని తెలిపారు. ఏదో పెద్ద బాహుబలి సినిమా చేస్తున్నావా ఏంటి అంటూ అవమానించారని వేణు తెలిపారు.

చిన్న సినిమాలలో బాహుబలి..
ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత మీరు ఈ సినిమాపై స్పందిస్తూ చిన్న సినిమాలలో బాహుబలి అంటూ కామెంట్స్ చేయడం తను ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అంటూ ఈ సందర్భంగా వేణు చేస్తున్నటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Vishal: మళ్లీ ఆయనే ఏపీ సీఎం.. హీరో విశాల్ కామెంట్స్ వైరల్!

Published

on

Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.

ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.

Advertisement

జగన్ అంటే అభిమానం..
ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!