బుల్లితెరపై ప్రసారమౌతున్న కార్తీకదీపం సీరియల్ నేటి ఎపిసోడ్ ఎంతో రసవత్తరంగా సాగుతుంది. గత ఎపిసోడ్ లో అంజి ఆచూకీ దొరకడంతో దీప, మోనిత అంజిని పట్టుకోవడానికి బయలుదేరుతారు.ఈ క్రమంలోనే దీప తన పిన్ని దగ్గరికి వెళ్తున్నానని అబద్ధం చెప్పి అంజి కోసం బయలుదేరుతుంది. ఈ క్రమంలోని ఈరోజు1108 వ ఎపిసోడ్ లోకి ఎంటరైన కార్తీకదీపం సీరియల్ లోని హైలెట్స్ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
అంజి సూర్యాపేటలో ఉన్నాడని తెలుసుకున్న దీప,మోనిత ఎలాగైనా అంజిని పట్టుకుంటే తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని బయలుదేరుతారు. అంజి ఆచూకీ దొరకడంతో మోనిత ఎంతో సంతోషంతో డ్రైవ్ చేసుకుంటూ అంజి కోసం బయల్దేరుతుంది. ఈ క్రమంలోనే తన మనసులో చేజారిపోయాయి అనుకున్న అంజిగాడు దొరికాడు. వాడిని వదిలి పెట్టకూడదు మాట విన్నాడో సరే.. లేదంటే దీనికి పని చెప్పాల్సి ఉంటుంది అంటూ తుపాకీ చేతిలో పట్టుకుంటుంది.
సూర్యాపేటకు వెళ్తున్న దీపతో క్యాబ్ డ్రైవర్ ఏంటక్కా ఈ సమయంలో ఒంటరిగా వెళుతున్నావు అని అడిగాడు. అందుకు దీప నువ్వు ఉన్నావు కదా తమ్ముడు తోడుగా అంటూ సమాధానం చెబుతుంది. అంత అర్జెంట్ పని ఏముంది అని అడగగా.. నువ్వు వారణాసి మాదిరిగానే నాకు ఇంకో తమ్ముడు ఉన్నాడు అతనిని కలవాలి.నామాదిరి వారణాసి లాగా అంటే నువ్వు ఫోన్ చేయగానే నీ దగ్గరికి వస్తారు కదా అక్క.. కానీ ఏదో ముఖ్యమైన పని ఉండే ఉంటుంది అనుకుని ఇక ఏ వివరాలు అడగను అంటూ కారు నడుపుతాడు.
Advertisement
దీప ఉదయాన్నే వస్తానని చెప్పిన కార్తీక్ కలవర పడుతుంటాడు. అసలు దీప ఏం చేస్తుంది అని ఆలోచిస్తుండగా అప్పుడే భాగ్యం నుంచి ఫోన్ వస్తుంది. బాబు కాస్త దీపకి ఫోన్ ఇవ్వు అని అడగగా కార్తీక్ షాక్ అవుతాడు. నిజం చెప్పితే ఉదయం లేవగానే ఫోన్ చేయిస్తా అని చెబుతాడు. తన పిన్ని ఇంటికి వెళ్తాను అని చెప్పిన దీప అక్కడికి వెళ్లకుండా ఏం చేస్తుంది..మోనిత ఇంటికి వెళ్లిందా అక్కడ ఏం గొడవ జరుగుతుందో అంటూ కంగారుపడుతూ..మోనిత ఇంటికి వెళతాడు.అక్కడికి వెళ్ళగానే ప్రియమణి అమ్మ గారు లేరు రేపు ఉదయం వస్తానని చెప్పి వెళ్లారు అనడంతో కార్తీక్ లో కంగారు పుడుతుంది.
ఇక కారు నడుపుకుంటూ మోనిత ఒరేయ్ అంజి నిన్ను ట్రంపు కార్డుల వాడుకోవాలని చూస్తుంది ఏసిపి రోషిని. నా మాట వింటే సరే లేదంటే నీ ప్రాణాలు తీస్తా అంటూ మనసులో అనుకోని బయలుదేరుతుంది. ఎలాగైనా నిన్ను ఫామ్ హౌస్ లో కట్టిపడేసి కార్తిక్ తో నా పెళ్లి జరిగేలా చూడాలి అని మనసులో అనుకుంటూ ఉండగా కారు రిపేర్ వచ్చి ఆగిపోతుంది. కారు ఆగిపోవడంతో ఎలాగైనా ముందు వెళ్ళాలి లేకపోతే ప్రోబ్లం అవుతుందనే ఉద్దేశ్యంతో అందరిని లిఫ్ట్ అడుగుతుంది. ఇదే క్రమంలో దీప సూర్యాపేట వెళ్తున్న కారు అదే దారిలో వెళ్తునడటంతో ఆ కార్ ఆపి లిఫ్ట్ అడుగుతుంది మొనిత. అయితే ముందుగానే డ్రైవర్ కు కారులో నేను ఉన్నానని చెప్పకుండా ఎక్కడికి వెళ్తుందో కనుక్కో.. మనం విజయవాడ వెళ్తున్నాం అని చెప్పు అని చెబుతుంది దీప.
ఈ క్రమంలోనే కారు ఆపగానే సూర్యాపేట వరకు లిఫ్ట్ ఇమ్మని అడుగుతుంది మొనిత. డ్రైవర్ సరే ఎక్కండి అని ఎక్కించుకుంటాడు. వెనుక సీట్ లో దీప దుప్పటి కప్పుకుని పడుకున్నట్టు నటిస్తుంది. వెనుక ఉన్నది ఎవరని డ్రైవర్ని అడుగుతుంది మోనిత. మా అక్క నిద్రోస్తుందని పడుకుంది అని చెబుతాడు డ్రైవర్. ఈలోపు ఒక ఫోన్ చేసి వీరేశం నేను ఇంకో నలబై నిమిషాల్లో సూర్యాపేట 8 హోటల్ దగ్గరకి వచ్చేస్తాను అని చెబుతుంది. అదంతా వెనుకనుంచి వింటున్న దీప.. వారినీ దీనికి ఇంత నెట్ వర్క్ ఉందా.. ఏసీపీ కి తెలిసిన విషయం వెంటనే దీనికి ఎలా తెలిసిపోయింది అంటూ ఆలోచిస్తుంటుంది.. ఈలోపు కార్తిక్ తన తమ్ముడుతో దీప ఎక్కడికి వెళ్లిందో.. మోనిత కూడా కనిపించడం లేదు.. ఆ రాకాశి మొనిత దీపని ఎం చేస్తుందో అని భయపడుతూ మాట్లాడుతుంటాడు. అక్కడికి ఎపిసోడ్ పూర్తవుతుంది.
తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద విషయం. ఆ ఘనత ఎన్టీవీకి దక్కింది. తొలిసారి ఎన్టీవీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. తన మనసులోని మాటను ప్రధాని మోడీ ఎన్టీవీతో పంచుకోనున్నారు. అది ఎప్పుడో కాదు.. నేటి రాత్రి 8 గంటలకు ప్రధాని ఎన్టీవీకి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. పదేళ్లుగా తిరుగులేని విజయాలను సాధిస్తూ ప్రజల గుండెలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న ప్రధాని మోడీ.. ఎన్టీవీతో ఈ సార్వత్రిక ఎన్నికల ముచ్చట్ల గురించి మాట్లాడనున్నారు. లోక్సభ ఎన్నికల వేళ మీడియాకు అతి తక్కువ సమయం మాత్రమే ఇవ్వగలిగేంత బిజీ షెడ్యూల్లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఎన్టీవీకి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వడం గమనార్హం. గతంలో భక్తి టీవీ నిర్వహించిన కోటి దీపోత్సవానికి విశిష్ట అతిథిగా ప్రధాని మోడీ హాజరయ్యారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న కీలక సమయంలో ఎన్టీవీకి ప్రధాని ఇంటర్వ్యూ ఇవ్వడమనేది చాలా పెద్ద విషయం. అలా చూసుకున్నా ఎన్టీవీ దేశ టెలివిజన్ చరిత్రలోనే అరుదైన ఘనతను సాధిస్తోందని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో జరుగుతున్న కీలక పరిణామాలపై ప్రధాని మోడీ సమాధానమివ్వనున్నారు. ప్రజల మెదళ్లలో నానుతున్న ఎన్నో ప్రశ్నలు, ప్రచారంలో ఉన్న మరెన్నో సందేహాలపై తెలుగు ప్రజల తరపున ఎన్టీవీ ప్రశ్నించనుంది. ఒకే ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని మోడీ దగ్గర కానున్నారు.
Lakshmi Parvathi: సీనియర్ ఎన్టీఆర్ సతీమణి వైసిపి నాయకురాలు లక్ష్మీపార్వతి బుధవారం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గురించి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ కపటం లేని మంచి మనిషి అని తెలియజేశారు. అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడుని నమ్మి మోసపోతున్నారని తెలిపారు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబును మించిన వారు ఎవరూ లేరు.
తన సొంత మామయ్యని వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబు నాయుడుది. పిఠాపురంలో కాపులందరూ కూడా ఐక్యం కావాలని తెలిపారు. ఇలా కాపులందరూ కూడా వైసిపి అభ్యర్థి వంగా గీతకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు వంగా గీత స్థానిక నేత ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే ఆమె వెంటనే స్పందిస్తారు కానీ పవన్ కళ్యాణ్ అలా కాదని తెలిపారు.
Advertisement
పవన్ కళ్యాణ్ వలస వచ్చారు.. పవన్ కళ్యాణ్ పిఠాపురానికి వలస వచ్చారని ఈమె తెలిపారు. కానీ వంగా గీత స్థానికురాలు. అందుకే వంగా గీతకు ఓట్లు వేసి అసెంబ్లీకి పంపించాలని ఈమె కోరారు. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో భాగంగా గాజువాక భీమవరం నుంచి పోటీ చేసినటువంటి ఈయనకు రెండు చోట్ల చేదు అనుభవాలే ఎదురయ్యాయి ఇలా రెండు ప్రాంతాలలో ఓటమిపాలు అయినటువంటి పవన్ కళ్యాణ్ కాపు ఓట్లు అధికంగా ఉన్నటువంటి పిఠాపురం నుంచి పోటీకి దిగారు.
Janasena: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కూటమిలో భాగంగా 21 స్థానాలలో పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే .ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా జనసేన ప్రచార కార్యక్రమాలు కూడా భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు.
మరోవైపు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా సినీ సెలబ్రిటీలు మొత్తం తరలి వస్తున్నారు. ఇప్పటికే మెగా హీరోలు అందరూ కూడా పిఠాపురంలో పర్యటన చేయగా చిరంజీవి రామ్ చరణ్ వంటి వారు సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ ని గెలిపించాలని కోరారు అయితే తాజాగా జనసేన నేతలకు నాగబాబు మాజీ అల్లుడు జొన్నలగడ్డ వెంకట చైతన్య భారీ షాక్ ఇచ్చారు.
సోషల్ మీడియా వేదికగా ఈయన జనసేన పార్టీకి ఓటు వేయొద్దని తెలియజేశారు. స్వార్థ రాజకీయాల కోసం మెగా ఫ్యామిలీ ఎంతకైనా తెగిస్తుందని తెలిపారు. ప్యాకేజీ కోసం మెగా ఫ్యామిలీ ఎంతకైనా దిగజారుతుంది. జనసేన సిద్ధంతాలను పవన్ కళ్యాణ్ కూడా పాటించరు. ఆయన మాటలకు చేష్టలకు ఏమాత్రం పొంతన ఉండదని తెలిపారు.
Advertisement
ఆర్టిస్టులను భయపెడుతున్నారు.. చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే మెగా ఫ్యామిలీ పని చేస్తుందని, ప్రచారాలకు రాకపోతే తమకు అవకాశాలు లేవని ఆర్టిస్టులను భయపెట్టి ప్రచార కార్యక్రమాలకు తీసుకువస్తున్నారని తెలిపారు. ఇలా ఎంతోమంది జనసేనను నమ్మి మోసపోయారు అంటూ ఈ సందర్భంగా వెంకట చైతన్య చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.