Connect with us

Featured

నీ మొగుడంటే నాకు మోజే.. అర్ధం చేసుకోవే దీప.. ప్లీజ్.. వంటలక్క వేడుకుంటున్న మోనిత!

స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు అభిమానులను పెంచుకుంటూపోతుంది. ఈ క్రమంలోనే ఈ సీరియల్ నేడు1102 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది.

Published

on

 

స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు అభిమానులను పెంచుకుంటూపోతుంది. ఈ క్రమంలోనే ఈ సీరియల్ నేడు1102 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. గత ఎపిసోడ్ లో దీప రోషిని కలిసి మాస్టర్ ప్లాన్ వేసిన సంగతి తెలిసిందే. మరి ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరుగుతోంది అనే విషయానికి వస్తే… దీప తన పిల్లలకు భోజనం పెడుతూ ఉండగా పిల్లలు ఇద్దరు సవితి తల్లి ప్రస్తావన తీసుకువస్తారు. మనకు సవతితల్లి లేదు అందుకు మనం హ్యాపీ అంటూ ఉండగా దీప పిల్లలను ఉద్దేశించి వయసుకు తగ్గట్టు మాటలు మాట్లాడండి అంటూ కోపగించుకుంటుంది.

Advertisement

హాస్పిటల్లో ఆనంద్ రావు దగ్గర కార్తీక్, ఆదిత్య ఉండి నాన్నను జాగ్రత్తగా చూసుకోవాలి. హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న ప్రతి ఒక్కరిని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి ఇలాంటి ఉద్వేగపూరితమైన విషయాలను చెప్పకూడదు అంటూ కార్తీక్ చెబుతాడు. అయినా మోనిత తన గర్భం గురించి చెప్పింది కనుక ఇంతకన్నా దారుణం ఇంకొకటి ఉండదు కనుక నాన్నను జాగ్రత్తగా చూసుకోవాలని మాట్లాడుతుంటారు. ఇక మోనిత ఇంటికి వెళ్లి దీప అంజి ప్రస్తావన తీసుకురావడం…అంజి వైజాగ్ లో కనిపించకపోవడం విషయాలను గుర్తు చేసుకుని పిచ్చిదానిలా రియాక్ట్ అవుతుంది. ఈ స్థితిలో మోనితను చూసిన ప్రియమణి కంగారు పడుతుంది. అప్పుడే మోనితకు పెళ్లా? జైలా…? అని భాగ్యం, దీపా అన్న మాటలు గుర్తుకు వస్తాయి. ఈ క్రమంలోనే మోనిత మాస్టర్ ప్లాన్ వేసి హాస్పిటల్ కు క్యారేజ్ తీసుకు వెళుతుంది.

హాస్పిటల్లో భాగ్యం ఆదిత్యకు, కార్తీక్ ను భోజనానికి రమ్మని పిలుస్తుంది. దీంతో కార్తీక్ ఆకలిగా లేదని చెబుతాడు. వెంటనే మోనిత నా చేతితో పెడితే నా కాబోయే భర్త తింటాడు అంటూ లోపలికి వస్తుంది. ఇలా మోనిత అనడంతో భాగ్యం కోపంతో క్యారేజితో కొట్టానంటే తలకాయ్ క్యాబేజిలా పగిలిపోతుందని భాగ్యం అనగా నువ్వు కొడతావని నాకు తెలుసు అందుకే విషం కలిపిన నీళ్ళు తీసుకువచ్చాను… నా చావుకు కారణం మీరేనని ముందుగా లెటర్ రాసి ఇచ్చి వచ్చాను అని బెదిరిస్తుంది. అప్పుడే డోర్ కొట్టిన శబ్దం రావడంతో కార్తీక్ వెళ్లి తలుపు తీస్తే దీప ఎంటర్ అవుతుంది. దీపక్ ఎంటర్ అవ్వగానే భాగ్యం ఇది బాటిల్ లో విషం కలిపిన నీళ్ళు తీసుకువచ్చి అందరినీ బెదిరిస్తుందని చెప్పడంతో దీప ఆవేశ పడుతుంది. తాగువే… ఈ విషయం నీళ్లు తాగు అంటూ మోనిత బెదిరిస్తుంది. పోనీ నేను తాగానా..? అంటూ బాటిల్ మూత తీసి దీప తాగుతుంది.

ఇది కేవలం నీళ్లు మాత్రమే ఈ బాటిల్ లో విషం లేదు.ఈ మోనితలో విషం ఉంది. ఇంకా ఎన్ని రోజులు బెదిరిస్తావు అది చెయ్యి కూడా కోసుకోలేదు… పిన్ని వెళ్లి నర్సును అడిగి ఆపరేషన్ బ్లేడ్ తీసుకురా చెయ్యి కోసి కారం పెడతా అనడంతో మోనిత దీప కాళ్ళపై పడి నీ పెళ్లి కాకముందే నేను కార్తీక్ ను ప్రేమించాను అంటూ.. ఆ విషయం కార్తీక్ కి కూడా తెలుసని చెబుతుంది.కార్తీక్ మాట్లాడుతూ మనిద్దరి మధ్య ప్రేమ లేదు అని చెబుతాడు.నిన్న చచ్చిన పెళ్లి చేసుకోనని కార్తీక్ తెగేసి చెబుతాడు ఆ మాట విన్న మోనిత ఎంతో కంగారు పడుతుంది. ఆ తరువాత మోనిత ఏం చేస్తుందనే విషయం తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Featured

Prabhas: ప్రభాస్ కి ఫ్రస్టేషన్ వస్తే అలా బిహేవ్ చేస్తారా.. డార్లింగ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?

Published

on

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.

ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.

Advertisement

ఇష్టమైన ఫుడ్ తింటారు..
ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.

Advertisement
Continue Reading

Featured

Nikhil siddarth: కొడుకు పుట్టిన తర్వాత ఆ అలవాటు మానుకున్నాను.. నిఖిల్ కామెంట్స్ వైరల్!

Published

on

Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.

త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.

Advertisement

పార్టీలకు వెళ్లడం మానుకున్న..
ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: ఈ చిన్న పని చేస్తే చాలు ప్రభాస్ సలార్ సినిమా బైక్ గెలుచుకోవచ్చు.. ఎలాగంటే?

Published

on

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.

ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Advertisement

క్విజ్ కాంటెస్ట్..
ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!