Connect with us

Featured

జూలై 13 ఎపిసోడ్: దీప సౌందర్య రోడ్డు మీద పడే టైం వచ్చింది..!

Published

on

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కార్తీకదీపం సీరియల్ నేడు (జులై 13)1090 ఎపిసోడ్‌ ప్రసారం కానుంది. కార్తీక్ తప్పు చేయలేదని నువ్వు నమ్ముతున్నావా?? నువ్వు తప్పుల మీద తప్పులు చేయగల సమర్థరాలవని నమ్ముతున్నాను… నా మొగుడు సంస్కారవంతుడు గౌరవమైన కుటుంబంలో పుట్టిన వాడు. నీలాగా గాలిక పుట్టి నీ ముందు తల వంచాల్సిన కర్మ నా మొగుడికి, నా కుటుంబానికి పట్టలేదు. ఆయన గురించి నాకు తెలుసు.. పిచ్చి పిల్ల? శీలాన్ని త్యాగం చేయకు..25న గుండె నొప్పి వస్తే మా ఆయన హాస్పిటల్లో చేరు.. మెంటల్ వస్తే పిచ్చాసుపత్రిలో చేరు ఇంకొకసారి నీ మొగుడు నాకే సొంతం అని వచ్చావ్ అనుకో శ్రీరామ్ బస్తీలో ఆడవాళ్లు నిన్ను పొలిమేరల దాకా తరిమి తరిమి కొడతారు. మళ్లీ నా జీవితంలోకి నా జోలికి కావాలంటే గజగజ వనికి చస్తావు గెటవుట్ అంటూ మోనితకు దీప వార్నింగ్ ఇస్తుంది. “చూస్తా మీ అందరి అంతు చూస్తా అంటూ మోనిత ఆవేశంగా వెళ్లిపోతుంది.

భాగ్యమ్మ ఇంటికి బ్యాగ్లు పట్టుకెళ్లి మీ గుణవతి మేడం ఎక్కడ అని అడగగా అందుకు ప్రియమని మీకు దండంపెడతా మిమ్మల్ని ఇంట్లోకి రానిస్తే మా అమ్మగారు నన్ను ఇంటి నుండి బయటకు పంపుతారు మీరు వెళ్లిపోండి మీకు దండం పెడతా అని చెప్పడంతో భాగ్యం “అబ్బో.. మీ మేడమ్ ఎంత జీతం ఇస్తోందేంటీ”అని భాగ్యం అడగగా పాతికవేలమ్మ అని ప్రియమణి చెప్పడంతో నీ కడుపు ఎందుకు కొట్టాలిలే గేటు బయట కూర్చుంటానని బయట గేటు దగ్గర కూర్చుంటుంది.

ఇక ఆదిత్య దీపతో మాట్లాడుతూ… అన్నయ్యలో చాలా మార్పు వచ్చింది వదిన మొన్న భాగ్యం అత్త తో కూడా ఎంతో అభిమానంగా మాట్లాడారట. దీప షాక్ అవుతూ పిల్లలకు మా పై చాలా అనుమానాలు వస్తున్నాయి అందుకే మేము మౌనంగా ఉండటం మానేశాము. ఇక సీన్ కట్ చేస్తే మోనిత ఏసీపీ రోషిణీ ఇంటికి వెళ్తుంది. ఎక్స్ క్యూజ్ మీ అని పిలవడంతో రోషిణీ బయటికి వస్తుంది. ‘ఎవరు’అనగానే గుర్తు పట్టడం లేదా మేడం… 10 సంవత్సరాల క్రితం దీప మిస్సింగ్ కేసులో నన్ను ఇంటరాగేట్ చేశారు. తరువాత తప్పు లేదని వదిలేసారు అని చెప్పడంతో రోషిని హో.. నువ్వు కార్తీక్ ఫ్రెండ్స్ కదా..?  ‘సిట్.. కమ్’ అని పిలిచి మరీ కూర్చోబెడుతుంది. మీ సమస్య ఏమిటో చెప్పండి. అని రోషిని అడుగుతుంది.

Advertisement

నాకు అన్యాయం జరిగింది పెళ్లి కాకుండానే తల్లి అయ్యాను. అని చెప్పగా మీరు డాక్టర్ కదా.. ఎందుకు అలా తొందర పడ్డారు. ఎవరతను అని అడగడంతో డాక్టర్ కార్తీక్ అని సమాధానం చెబుతుంది.వాట్.. ఇద్దరూ ఫ్రెండ్సే కదా.. అతడికి పెళ్లి అయ్యింది కదా? ఒక గౌరవనియ్యమైన వృత్తిలో ఉన్న మీరు ఇలా చేయడం ఎంటి అని అడుగుతుంది.ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెబుతాను.అంటుంది మోనిత. ‘ఏం జరిగిందో చెప్పండి ఎలా జరిగిందో వివరించొద్దు’ అంటుంది రోషిణీ. దాంతో మోనిత.. ‘కార్తీక్‌ని పైకి తీసుకుని వెళ్లడం, మరునాడు ఉదయం కిందకి రావడం, నైట్ ఎక్కువగా తాగేశావ్ అని కార్తీక్‌తో అన్న సీన్ వరకు చెప్పి.. అది జరిగింది అదే చెప్పగా.. అందుకు రోషిణీ.. ఒక ఫ్రెండ్ ని ఇంట్లో కూర్చోబెట్టుకొని.. తాగడానికి పర్మిషన్ ఇచ్చి పడుకోవడానికి రూము ఇచ్చి కూడా మీరు ఆ గదిలోకి వెళ్లి ఏంటది మీ ఇద్దరి మధ్య కేవలం స్నేహం ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు మీకు వచ్చిన సమస్య ఏంటి అని ఏసీపీ ప్రశ్నించగా..

కార్తీక్ మొహం చాటేస్తున్నాడు. తన కుటుంబం నన్ను దూరం పెడుతుంది. కార్తీక్ కి ఎలాంటి శిక్ష లేకుండా కేవలం నా మెడలో తాళి కట్టి నన్ను భార్యగా స్వీకరిస్తే చాలు. ఇప్పుడు నాకు మీరు మాత్రమే సహాయం చేయగలరు అంటూ కన్నీరు పెట్టుకుంటుంది. దీంతో రోషిని మీరు ఏడవకండి అంటూ ఆమెను ఓదారుస్తుంది. నా బిడ్డ తండ్రి లేని అనాధగా మారిపోతుంది. సాటి స్త్రీ గా ఆలోచించి నాకు సహాయం చేయండి.ఈ ప్రపంచంలో మీరు తప్ప నాకు ఎవరు సహాయం చేసే వారు లేరు అని ఏడ్చగా ‘కూల్ కూల్.. ఓకే.. నేను ఎంక్వైరీ చేస్తాను.. మీకు న్యాయం జరిగేలా చేస్తాను.. డోంట్ వర్రీ.. ఎలాంటి ఆలోచన చేయకుండా ఇక్కడినుంచి వెళ్ళండి అంటూ సాగనంపుతుంది. ఆ దీప సౌందర్య అందరూ రోడ్డు మీద పడే టైం వచ్చింది అని మనసులో సంబరపడుతూ అక్కడి నుంచి వెళ్తుంది.

ఇక దీప ఇంట్లో అందరూ సంతోషంగా ఉండగా రోషిణీ ఎంట్రీ ఇస్తుంది. ‘ఎక్స్ క్యూజ్ మీ’ అనగానే.. రోషిణీని గుర్తుపడుతుంది దీప. గతంలో నీకు ఏ సమస్య వచ్చినా నేను ఉన్నానని మరిపోకు దీపా’ అని అభయం ఇచ్చిన మాటలు గుర్తొచ్చి.. ‘రండి మేడమ్’ అంటుంది. లోపలికి వచ్చిన రోషిణీ ఎవరి తనని ఆదిత్యని చూసి అడగగా మా మరిది అంటూ పరిచయం చేస్తుంది. మా వదిన మిస్ అయినప్పుడు మీరే కదా ఎంక్వయిరీ చేసింది అని ఆదిత్య అంటాడు. అవును ఇప్పుడు విలువలు మిస్ అయ్యాయని కంప్లైంట్ వచ్చింది అంటుంది రోషిణీ. ఎవరు ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారని దీప అడగడంతో
మోనిత.. కార్తీక్ మీద ఇచ్చింది.. మోనితకి మీ భర్త అన్యాయం చేశాడని.. మీ కుటుంబం మొత్తం తనకు వ్యతిరేకంగా మారిందని న్యాయం కోసం వచ్చింది’ అంటుంది రోషిణీ. ‘న్యాయం చెయ్యండి.. న్యాయమే చేయండి మీరు న్యాయం వైపు నిలబడతారని నాకు తెలుసు అంటూ దీప చెబుతుంది.దీంతో దీప నా పేరు దీపం మా ఇంటి పేరు కార్తీక్ ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు 10 సంవత్సరాల క్రితం మేము విడిపోయాము. కార్తీక్ బాబు, మోనిత ఇద్దరూ కలిసి చదువుకున్నారు. 10 సంవత్సరాల నుంచి నేను విడిపోయిన చివరికి మేము కలుసుకునే సమయానికి ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందో అర్థం కాలేదు అని దీప అర్థమయ్యేలా వివరిస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

Featured

Meena: రెండో పెళ్లి వార్తలపై ఘాటుగా రియాక్ట్ అయిన మీనా… డబ్బుల కోసమే అంటూ?

Published

on

Meena: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మీనా గురించి ఇటీవల కాలంలో తరచూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఎప్పుడైతే ఈమె భర్త విద్యాసాగర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారో అప్పటినుంచి మీనా రెండో పెళ్లి గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ విధంగా మీనా రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె ఇదివరకే పలు సందర్భాలలో రెండో పెళ్లి గురించి స్పందించి క్లారిటీ ఇచ్చారు. అయితే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె మరోసారి రెండో పెళ్లి వార్తలపై స్పందించారు.

ఈ సందర్భంగా మీనా రెండో పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందిస్తూ తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ సోషల్ మీడియాలో దారుణమైనటువంటి వార్తలు వస్తున్నాయి. కేవలం డబ్బు కోసమే ఇలాంటి వార్తలు రాయొద్దు రాసేటప్పుడు నిజా నిజాలు తెలుసుకొని రాయాలని ఈమె సూచించారు.

Advertisement

అలాంటి ఆలోచన లేదు..
ఇప్పటికే రెండో పెళ్లి గురించి పలు సందర్భాలలో తాను చెప్పానని ఇప్పుడు కూడా చెబుతున్నానని తెలిపారు. తాను రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఏమాత్రం లేనని తనకు ఆ ఆలోచన కూడా లేదని తెలిపారు. ఒకవేళ అలాంటి ఆలోచనలు కలిగి నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ విషయాన్ని నేనే అందరికీ తెలియజేస్తాను అంటూ ఈ సందర్భంగా మీనా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mokshagna: ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న మరో నందమూరి హీరో.. మోక్షజ్ఞనే ఆలస్యమా?

Published

on

Mokshagna: మోక్షజ్ఞ పరిచయం అవసరం లేని పేరు. నందమూరి వారసుడిగా బాలయ్య కుమారుడిగా అందరికీ సుపరిచితం అయినటువంటి మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారు అంటూ గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా ఈయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి సందర్భాలు ఏమి లేవు.

ఇలా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూసి ఆశలను కూడా నిరాశ చేసుకుంటున్నారు ఇలాంటి తరుణంలోనే మోక్షజ్ఞ కంటే ముందుగానే మరో నందమూరి హీరో ఇండస్ట్రీలోకి రాబోతున్నారని తెలిసి బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మరి మోక్షజ్ఞ కంటే ముందుగా ఇండస్ట్రీలోకి రాబోయే ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే..

దివంగత నటుడు హరి కృష్ణ గారికి ముగ్గురు కుమారులు అనే సంగతి మనకు తెలిసినదే. వీరి పెద్ద కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈయనకు ఇద్దరు కుమారులు పెద్ద అబ్బాయి పేరు నందమూరి తారక రామారావు కావటం విశేషం. ఈ అబ్బాయి ఇదివరకే పలు సినిమాలలో బాలనటుడిగా నటించారు అయితే త్వరలోనే ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.

Advertisement

వైబిఎస్ చౌదరి..
ఇండస్ట్రీలో దర్శకుడుగా ఒకానొక సమయంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వైవిఎస్ చౌదరి గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు అయితే ఈయన ఒక అద్భుతమైన ప్రేమ కథ సినిమాని సిద్ధం చేశారని రీ ఎంట్రీ ద్వారానే నందమూరి తారక రామారావును హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి మోక్షజ్ఞ విషయంలో బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Supritha: స్ప్రైట్ లో మందు కలుపుకొని తాగాను.. అమ్మకు తెలిసి పిచ్చ కొట్టుడు కొట్టింది: సుప్రీత

Published

on

Supritha: తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సురేఖ వాణి ఒకరు. ఈమె కుమార్తె సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టకముందే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ కంటెస్టెంట్ బుల్లితెర నటుడు అమర్ హీరోగా ఇటీవల ఓ సినిమాలో నటిస్తున్నారు ఇందులో హీరోయిన్లు సుప్రీత అవకాశం అందుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసే రీతూ చౌదరి యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి దావత్ అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో భాగంగా రీతూ సుప్రీతను వివిధ రకాల ప్రశ్నలు అడిగారు.

ఈ సందర్భంగా ఈమెకు సుప్రీతను ప్రశ్నిస్తూ నీ కెరియర్లో జరిగినటువంటి బలుపుతో చేసిన పనులు గురించి చెప్పమని అడిగారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ కిక్ ఇచ్చే పనుల కోసం తాను స్కూల్ చదువుతున్న సమయంలోనే లైసెన్స్ లేకుండానే అమ్మ కారు వేసుకొని వెళ్లే దాన్ని ఈ విషయం తెలిసి అమ్మ పిచ్చ కొట్టుడు కొట్టిందని తెలిపారు. అంతేకాకుండా స్ప్రైట్ లో ఆల్కహాల్ కలుపుకొని తాగానని ఒక రోజు స్కూల్ కి వెళ్లి అందరికీ కూడా పంచానంటూ ఈమెకు తెలిపారు.

Advertisement

నంబర్ బ్లాక్ చేస్తే సహించెను..
ఇక ఎవరైనా నా ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తే అసలు సహించను. వేరే ఫోన్ నుంచి కాల్ చేసి మరి వారికి వార్నింగ్ ఇస్తాను అంతే కాకుండా నేను ఇష్టపడే అబ్బాయి వైపు చిన్నప్పుడు ఎవరైనా చూస్తే వెళ్లి కొట్టేదాన్ని అంటూ ఈ సందర్భంగా సుప్రీత చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!