హిమాచల్ప్రదేశ్లో కొండచరియలు విరిగిపడటంతో శిథిలాల కింద 50-60 మందికి పైగా చిక్కుకుపోయారు.కిన్నౌర్ జిల్లాలోని రెకాండ్ పియో- సిమ్లా రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కొండచరియలలో చిక్కుకున్న వారిని రక్షించడం కోసం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఐటీబీపీ అధికారులు ఇప్పటివరకు 13 మృతదేహాలను వెలికితీశారు.

కొండచరియల కింద సిమ్లాకు వెళ్తోన్న హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వ రవాణాకు చెందిన బస్సు, ఓ ట్రక్కు, కొన్ని కార్లు చిక్కుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బస్సులో సుమారుగా 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.































