Kirrak RP : జబర్దస్త్ ద్వారా బాగా ఫేమస్ అయిన కిర్రాక్ ఆర్పి అందులో నుండి బయటకు వచ్చాక ఇతర ఛానెల్స్ లో కొద్దిరోజులు షోస్ చేసాడు. ఇక జబర్దస్త్ గురించి, మల్లెమాల గురించి బాగా విమర్శించి వైరల్ అయ్యాడు. ప్రస్తుతం కూకట్ పల్లి హైదరాబాద్ లో ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ పేరుతో ఒక కర్రీ పాయింట్ పెట్టి మరోసారి వార్తల్లో నిలిచాడు. మీడియా పబ్లిసిటీతో కట్టెల పొయ్యి మీద వండిన నెల్లూరు నుండి తెప్పించిన చేపలతో చేసిన పులుసుకు బాగానే డిమాండ్ క్రియేట్ అయింది. జనం ఎగబడ్డారు, ఏకంగా ట్రాఫిక్ జామ్ అయ్యేంతలా కిర్రాక్ కర్రీ పాయింట్ కి డిమాండ్ పెరిగింది.

నెల్లూరు చేపల పులుసుకు ట్రైనింగ్…
జనాల డిమాండ్ కు సరిపడా వండించలేక పోయిన ఆర్పీ కర్రీ పాయింట్ ను తాత్కాలికంగా ముయించాడు. భారీగా జనం క్యూ కట్టడం వల్ల వాళ్లందరికీ సరిపడా వండించలేకపోతున్నామని ప్రెస్ మీట్ పెట్టి మరీ నెల్లూరు మహిళలకు ఆఫర్ ఇచ్చాడు. నెల్లూరు చేపల పులుసు ఎవరైతే బాగా వండుతారో వాళ్ళు చేసి తీసుకువస్తే ఆడిషన్స్ ద్వారా సెలెక్ట్ చేస్తామంటూ చెప్పడంతో చాలా మంది మహిళలు కిర్రాక్ ఆర్పీకి తమ చేపల పులుసు ను రుచి చూపించడానికి వచ్చారు. ఇక వారిలో ఎవరు బాగా చేసారో రుచి చూసి డిసైడ్ చేస్తున్నాడు ఆర్పీ.

నెల్లూరు చేపల పులుసు కట్టెల పోయి మీద సరిగ్గా నెల్లూరు వాళ్ళు వండినట్లే వండి వడ్డిస్తానంటూ ఆర్పీ మాటిచ్చాడు. హైదరాబాద్ జనాలకు నెల్లూరు చేపల పులుసు రుచి చూపుతానంటూ చెబుతున్నాడు. ఇక ఆర్పీ వద్దకు చేపల పులుసు చేసి తీసుకోచ్చిన మహిళలు చేపల పులుసును పూర్వం ఉండే విదంగా ఇప్పుడు చేస్తే అందరికి నచ్చుతుందని, కొత్తగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర అంటూ వేయాల్సిన పని లేదని కారం, ఉప్పు, చింతపండు పులుసు సరిగ్గా పడితే పులుసు బాగుంటుందని, చేసిన రోజు కంటే మరుసటి రోజుకు పులుసు మరింత రుచి వస్తుందని అందుకు కారణం అందులో వేసే అవపిండి మెంతి పిండి అంటూ తెలిపారు.































