Kirrak RP : సినిమాల్లోకి అడుగుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ గా సినిమాల్లో పనిచేసిన ఆర్పీ ఆపైన జబర్దస్త్ లో అదృష్టం పరీక్షించుకున్నాడు. జబర్దస్త్ ద్వారా బాగా ఫేమస్ అయిన కిర్రాక్ ఆర్పి అందులో నుండి బయటకు వచ్చాక ఇతర ఛానెల్స్ లో కొద్దిరోజులు షోస్ చేసాడు. ఇక జబర్దస్త్ గురించి మల్లెమాల గురించి బాగా విమర్శించి వైరల్ అయ్యాడు. ప్రస్తుతం కూకట్ పల్లి హైదరాబాద్ లో నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు పేరుతో ఒక కర్రీ పాయింట్ పెట్టి మరోసారి వార్తల్లో నిలిచాడు. కట్టెల పొయ్యి మీద వండిన నెల్లూరు నుండి తెప్పించిన చేపలతో చేసిన పులుసుకు బాగానే డిమాండ్ క్రియేట్ అయింది. జనం ఎగబడ్డారు, ఏకంగా ట్రాఫిక్ జామ్ అయ్యేంతలా కిర్రాక్ కర్రీ పాయింట్ కి డిమాండ్ పెరిగింది. రీ ఓపెన్ అయ్యాక కూడా బాగా బిజీగా ఉన్న హోటల్ గురించి అలాగే హోటల్ ద్వారా వచ్చే డబ్బులలో సమాజం కోసం వినియోగించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

పంచ్ ప్రసాద్ పూర్తి బాధ్యత తీసుకుంటున్నాను…
కిర్రాక్ ఆర్పీ తన హోటల్ బాగా సక్సెస్ అయిందని, అందరికీ నెల్లూరు చేపల పులుసు రుచి చూపించాలని అనుకుంటున్నట్లు అందుకే కష్టపడి హోటల్ కోసం కృషి చేసినట్లు తెలిపారు. ఇక కష్టపడి బాగా సంపాదిస్తున్నామని, లాభాలు బాగా వస్తున్నాయని తెలిపిన ఆర్పీ వచ్చిన దానిలో కొంత ఎవరికైనా సహాయం చేయడాని వినియోగించాలని భావిస్తున్నట్లు తెలిపారు. అలా మొదట జబర్దస్త్ లో కమెడియన్ గా ఉన్న పంచ్ ప్రసాద్ కు సహాయం ఆందించాలని అనుకుంటున్నట్లు చెప్పారు.

పైకి ఆనందంగా ఉన్నా పంచ్ ప్రసాద్ పరిస్థితి దారుణంగా ఉందంటూ తెలిపారు. తన చుట్టూ ఉన్నవాళ్లు పైకి నవ్వుతూ మాట్లాడిస్తూ మన అన్నట్లు ఉన్నారు కానీ ఎవరూ కావాల్సిన సహాయం చేయడం లేదని, అందుకే తనకు కిడ్నీ మార్పిడి చికిత్సకు కావలిసిన మొత్తం డబ్బులు పూర్తి బాధ్యత తీసుకుంటున్నట్లు ఆర్పీ తెలిపారు.

































