KK survey ceo: కేకే సర్వే ప్రస్తుతం నేషనల్ వైడ్ మారు మూగుతున్న పేరు. కిరణ్ కొండేటి సర్వే ద్వారా వెల్లడించిన ఫలితాలు ఏపీలో సంచలనంగా మారాయి. జూన్ 1వ తేదీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చాయి అయితే ఇందులో భాగంగా చాలా సర్వేలు వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పగా కేవలం కేకే సర్వే మాత్రం వైసిపి కేవలం 14 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందని చెప్పడంతో ఒక్కసారిగా సంచలనం అయింది.

ఈయన ఇచ్చిన సర్వే ఫలితాలు చూసి అందరూ షాక్ అయ్యారు. బహుశా ఈయన కూటమి నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని ఉంటారని అందుకే సర్వే ఫలితాలను ఇలా ఇచ్చారని పలువురు భావించారు. కేకే అంటే కమ్మ కాపు సర్వే అంటూ కూడా చాలామంది ట్రోల్ చేశారు. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈయన చెప్పిన సర్వే 95% నిజం కావడంతో ఒక్కసారిగా అందరు షాక్ అయ్యారు.
ఈయన వైసీపీ 14 సీట్లకు పరిమితమవుతుందని చెప్పగా కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయింది. అయితే ఎన్నికల ఫలితాలు అనంతరం కిరణ్ కొండేటి పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఇక ప్రస్తుతం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ను ఈయన కలవాలి అనుకుంటే ఎప్పుడు డోర్స్ తెరిచే ఉంటాయి కానీ నాకు అవసరం లేదు వారిని కలిస్తే నాకు బొకే బొక్క నేనెందుకు కలుస్తానని ఈయన తెలిపారు.
రాజకీయ విమర్శలు..
వారికి నా అవసరం ఉంటే వాళ్లే వచ్చి నన్ను కలుస్తారు అంటూ కిరణ్ కొండేటి వెల్లడించారు. తాను ఎవరి పక్షాన ఉంటూ సర్వే చేయలేదని నిజా నిజాలను బయటకు తీసే క్రమంలో ఈ ఫలితాలు వెలబడ్డాయని తెలిపారు. నేను ఈ ఫలితాలు వెల్లడించిన తర్వాత మా ఎడిటర్ అలాగే మా బంధువులందరూ షాక్ అయ్యారు.వాళ్లకి జస్ట్ అవి నెంబర్లు మాత్రమే. కానీ నాకు జీవితం. దీనిపై చాలామంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. నాతో పనిచేసిన టీం కూడా నెంబర్లు ఎవరికీ చెప్పకూడదని అగ్రిమెంట్ కుదుర్చుకొని చివరి వరకు చాలా సీక్రెట్ గా ఉంచి ఫలితాలను వెల్లడించామని తెలిపారు.





























