సీమ కుష్వాహా.. ఈ పేరు ప్రస్తుతం యావత్ దేశం మొత్తం జపిస్తుంది. ఎందుకు సీమ అంత ప్రత్యేకం అనుకుంటున్నారా.. భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు కని విని ఎరగని రీతిలో ఒకేసారి నలుగురు దోషులను ఉరికంబం ఎక్కించడం వెనక ఆమె అంతులేని పోరాటం ఉంది కాబట్టి.. నిర్భయ కేసులో దోషులకు శిక్ష పడటానికి ఇద్దరు మహిళలు తమ శక్తిని అంత కూడబెట్టి చివరి వరకు నిలబడ్డారు. ఈ రోజు శిక్ష అమలు జరిగే వరకు ఈ ఇద్దరు చేసిన కృషి ఎంత చెప్పిన తక్కువే.. ఆ ఇద్దరిలో ఒకరు నిర్భయ తల్లి ఆశా దేవి మరొకరు ఈ కేసు వాదించిన లాయర్ సీమ కుష్వాహా..
ఏడేళ్లుగా కంటి మీద సరిగ్గా నిద్ర కూడా పోలేదు వీరిద్దరూ. ఇలాంటి ఎన్నో కేసులు జరుగుతున్నాయి కానీ సీమ ఎందుకు ప్రత్యేకం అంటే ఆమెకు ఇదే మొదటి కేసు కావడం.. సీమ ఈ కేసు తీసుకోవడానికి ముందు అఘాయిత్యం జరిగిన మహిళల తరపున వాదించే జ్యోతి అనే ఒక ట్రస్ట్ లో ఒక మెంబర్ మరియు ట్రైనీ లాయర్, అలాగే ఆమె ఐఏఎస్ కి ప్రిపేర్ కూడా అవుతుంది. ఇకపై ఒక్క ఆడకూతురికి కూడా ఎలాంటి అన్యాయం జరగకూడదని సీమ ఒక కృత నిశ్చయంతో అడుగు ముందుకు వేశారు. నక్కజిత్తులతో, రోజుకొక ఎత్తుతో, చట్టంలో ఉన్న లోపాలను వాడుకుంటూ కేసును నీరుగార్చే ప్రయత్నం చేసిన కరుడుగట్టిన క్రిమినల్ లాయర్ ఎపి సింగ్ అడ్డుగా నిలబడి న్యాయాన్ని రెండు చేతులతో అడ్డుపెట్టి కాపాడారు. అంతే కాదు ఏడేళ్ల పాటు ఎన్నో బెదిరింపులను కూడా ఆమె లెక్కచేయలేదు.
ఇక సీమ ఢిల్లీ యూనివర్సిటీ నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొందింది. ఈ ఘటన జరిగినపుడు ఆమె ఒక ట్రైనీ మాత్రమే. సాధారణంగా ట్రైనీ లాయర్ అంటే ఎవరు కేసును వాదించడానికి ముందుకు రారు పైగా ఇంత కంప్లికేటెడ్ కేసును వాదించడానికి ఎపి సింగ్ వాదిస్తున్నాడని తెలిసి అందరు వెనకడుగు వేసిన ఆమె మాత్రం భయపడలేదు. ఇక ఆశాదేవి పేదరికం గురించి తెలిసిన ఆమె ఫ్రీగానే ఇన్నేళ్ళపాటు వాదించారు. కింద కోర్ట్ నుడి హై కోర్ట్, సుప్రీం కోర్ట్ వరకు ఆమె తన వాదనని కొనసాగించింది. అన్ని ఖర్చులు తానే భరించుకుంది. కోర్ట్ మారిన ప్రతి సారి కొత్త చిక్కులు ఎదురైనా, సీనియర్ లాయర్ల సలహాలు తీసుకుంటూ ముందుకు సాగింది.
ఇక ఆ నలుగురి కథ ముగిసింది అని తెలిసిన వెంటనే ఆశాదేవి మొదటగా ధన్యవాదాలు తెలిపింది సీమకే. ఏడేళ్ల పోరాటానికి ఈ రోజు ముగింపు పడింది. దేశ చరిత్రలోనే అత్యంత హేయమైన ఇలాంటి ఒక సంఘటనలో చివరికి న్యాయం గెలిచింది అంటూ ఆశాదేవి తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ సంతోషం వెనక సీమ కుష్వాహా కఠోర శ్రమ ఉంది అంటూ ఆమె కొనియాడింది. ఒక యువ లాయర్ న్యాయం కోసం ఇంత ఒంటరి పోరాటం చేస్తుంటే అనుభవం ఉన్న ఎపి సింగ్ లాంటి క్రిమినల్ లాయర్లు మాత్రం సీమ పై పలుమార్లు మాటల దాడి చేసారు. అయినా ఆమె తన పట్టుదల విడవలేదు. ఈ కుర్ర అమ్మాయి ఎం చేస్తుందిలే అనుకున్న వారికి ఇప్పటికి సమాధానం దొరికింది. ఇకనైన ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని కోరుకుందాం.
Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్ ట్యాపింగ్ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్ లీడర్ ప్రమేయం ఉందని వెల్లడించారు.
ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.
Advertisement
పొలిటికల్ లీడర్.. ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.
Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.
ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.
Advertisement
పార్టీని కాదు, నాయకుడిని చూడాలి.. పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.
Advertisement
హీరో నాని.. గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.