Connect with us

Featured

Kodanda Ramireddy : హీరో కృష్ణతో ఖైదీ చిత్రం తీయాలనుకోలేదు.. అసలు ఏం జరిగిందంటే.. : కోదండరామిరెడ్డి.

Published

on

Kodanda Ramireddy : చిరంజీవి – కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో న్యాయం కావాలి, కిరాయి రౌడీలు శివుడు శివుడు శివుడు, ప్రేమ పిచ్చోళ్ళు.. చిత్రాలు విడుదలయ్యాయి. మరొక బ్లాక్ బస్టర్ సినిమా వీరి కాంబినేషన్లో వచ్చింది… అసలు ఖైదీ చిత్రం విడుదల కంటే ముందు ఏం జరిగిందంటే… “కిరాయి రౌడీలు” లాంటి హిట్ చిత్రంతో చిరంజీవి.. కృష్ణతో “కిరాయి కోటిగాడు” లాంటి సూపర్ హిట్టుతో కోదండరామిరెడ్డి మంచి స్వింగ్ లో ఉన్నారు. ఒకరోజు నెల్లూరుకు చెందిన ప్రముఖ డాక్టర్ తిరుపతిరెడ్డి తమ వాస్తవ్యుడైన దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డిని కలవడం జరిగింది. వీరిద్దరు కలిసి ఒక సినిమాను రూపొందించాలనుకున్నారు. తమ ప్రాంతంలో కొంతకాలం నివాసం ఉన్న చిరంజీవి హీరోగా ఒక సినిమా రూపొందించాలనుకున్నారు.

యాక్షన్ చిత్రాల కథా రచయిత “వియత్నం వీడు సుందరం” ఎన్నో రకాలైన కథలను దర్శక నిర్మాతలకు వినిపించారు. కానీ అవేవి వారికి నచ్చలేదు. చిరంజీవి గారు అంతకుముందే దర్శక, నిర్మాతలకు 1983 జూన్ 15 నుంచి డేట్స్ ఇవ్వడం జరిగింది. జూన్ 8వ తేదీ వరకు కూడా కథ ఫైనలైజ్ కాలేదు.అప్పుడు నిర్మాతలు తిరుపతిరెడ్డి, ధనుంజయ రెడ్డి, నరసారెడ్డి పరుచూరి బ్రదర్స్ ని కలవడం జరిగింది.

జూన్ 10వ తేదీన తిరుపతిరెడ్డి తను చూసిన “ఫస్ట్ బ్లడ్” అనే ఆంగ్ల చిత్రం సీడీని పరుచూరి బ్రదర్స్ కి చూపించి దీన్ని ఆధారంగా చేసుకొని ఒక కథ రాయండని చెప్పడం జరిగింది. జూన్ 15 కు కేవలం ఐదంటే ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది. మద్రాసులో నివాసం ఉంటున్న ప్రముఖ నటుడు నూతన్ ప్రసాద్ మేడపై గదిలో రాత్రింబవళ్ళు కష్టపడి పరుచూరి బ్రదర్స్ ఒక కథ సిద్ధం చేశారు. అలా వారు రాసిన కథే ఖైదీ చిత్రం.

1982 లో “ఫస్ట్ బ్లడ్” విడుదలయిన ఆ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ఖైదీ చిత్రంలో కొద్ది మార్పులతో కనిపిస్తాయి. మిగతా చిత్రంలో కథానాయకుని ఆహార్యం, శారీరక భాష, ఖైదీ చిత్రం అడవిలో చిరంజీవి చేసిన సాహసాలు, సంఘటనలు ఆంగ్ల చిత్రం ఫస్ట్ బ్లడ్ ను పోలి ఉంటాయి.. 1983 అక్టోబర్ 28న విడుదలైన ఈ ఖైదీ సినిమా యాక్షన్ చిత్రాలకు ఎర్రతివాచీ పరిచింది. ఇంకా చెప్పాలంటే చిరంజీవి సినీ చరిత్రలో ఒక మైలు రాయిగా మిగిలిపోయింది.

అయితే కోదండరామిరెడ్డి ఓ ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ.. హీరో కృష్ణతో ఖైదీ చిత్రం రూపొందించాలనుకున్నారని యాంకర్ అడగగానే… ఆనాటి జ్ఞాపకాలను వివరిస్తూ.. చిరంజీవి అప్పుడు నిర్మాతలకు ఇచ్చిన డేట్స్ దగ్గర పడడంతో ఖైదీ చిత్ర కథ కేవలం ఐదు రోజుల్లో రూపొందించబడిందని.. ముహూర్తపు సన్నివేశాన్ని జైలులో సాధారణంగా జైలు ఖైదీకి షర్ట్, ప్యాంట్ కాకుండా డిఫరెంట్ గా మరొకటైతే బాగుంటుందని చిరంజీవి చెప్పడంతో.. అప్పటికప్పుడు ఆయన ఇంటి నుంచి నల్ల టీ షర్ట్, నల్లటి ప్యాంట్ తెప్పించారు. ఆ టీ షర్ట్ రెండు చేతులు కత్తిరించి అదే ప్యాంట్ పై టీ షర్ట్ వేసుకొని చిరంజీవి బెల్టు పెట్టుకున్నారని.. ఆ కాస్ట్యూమ్స్ పూర్తిగా చిరంజీవి ఆలోచనేనని.. ఇకపోతే ఖైదీ చిత్రాన్ని మరో హీరోతో నిర్మించాలనుకోలేదని ఆ ఇంటర్వ్యూలో దర్శకుడు కోదండరామిరెడ్డి వివరించారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Teenmar Mallanna: సమంత నాగచైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగ్ కారణం: తీన్మార్ మల్లన్న

Published

on

Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్‌ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్‌ లీడర్‌ ప్రమేయం ఉందని వెల్లడించారు.

ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.

Advertisement

పొలిటికల్ లీడర్..
ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ

Published

on

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

sut

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.

ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.

Advertisement

పార్టీని కాదు, నాయకుడిని చూడాలి..
పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ananya Nagalla: ఆ హీరో లాంటి భర్త కావాలంటున్న పవన్ హీరోయిన్.. అమ్మడి ఆశలు మామూలుగా లేవు?

Published

on

Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.

Advertisement

హీరో నాని..
గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!