Connect with us

Featured

KS Ravi Kumar : సౌందర్య ముఖం పై రమ్యకృష్ణ కాలు పెట్టే సీన్.. షూటింగ్ లో ఆమె ఏడ్చింది, చేయనన్నారు.. కానీ చివరికి.!!

Published

on

భాషా, ముత్తు, అరుణాచలం చిత్రాల అనంతరం మరొక సూపర్ హిట్ చిత్రంలో రజినీకాంత్ నటించాలనుకున్నారు. ఆ క్రమంలో.. దర్శకుడిగా కె ఎస్ రవికుమార్ అయితే బాగుంటుందని ఆయనను సంప్రదించారు. కథ ఎలాంటిదయితే బాగుంటుందనే ఆలోచనలో భాగంగా.. మాజీ ముఖ్యమంత్రి జయలలితను సూచిస్తూ.. జీవితంలో ‌ పంతాలకు, పట్టింపులకు పోయే మొండి పట్టుదలతో ఒక కథానాయిక కథ తయారు చేయమని రజినీకాంత్ దర్శకుడు రవికుమార్ తో చెప్పారు.

KS Ravi Kumar : సౌందర్య ముఖం పై రమ్యకృష్ణ కాలు పెట్టే సీన్.. షూటింగ్ లో ఆమె ఏడ్చింది, చేయనన్నారు.. కానీ చివరికి.!!

ఆ క్రమంలో పుట్టుకొచ్చినదే “నరసింహ” చిత్రం కథ. నరసింహ సినిమా చిత్రీకరణకు ముందు దర్శకుడు కె.ఎస్ రవికుమార్ చిరంజీవి తో తెలుగులో “స్నేహం కోసం” చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పొగరు, మొండి పట్టుదల గల ఈ పాత్రకు(నరసింహ-నీలాంబరి) హీరోయిన్ ఎవరైతే బాగుంటుంది అనుకునే క్రమంలో.. హీరోయిన్స్ నగ్మా, మీనా పేర్లు తెరపైకి వచ్చాయి. స్నేహంకోసం చిత్రంలో చిరంజీవితో జోడిగా మీనా నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ కొనసాగుతున్న సందర్భంలో ఒక సీన్ లో మీనా అగ్రెసివ్ లుక్ ఇవ్వాలి. ఆ సీన్ లో మీనా బాగా నటిస్తున్నారు కానీ అగ్రెసివ్ లుక్ ఆమె ఫేస్ లో రావడంలేదని దర్శకుడు కె.ఎస్ రవికుమార్ అనుకున్నారు.

KS Ravi Kumar : సౌందర్య ముఖం పై రమ్యకృష్ణ కాలు పెట్టే సీన్.. షూటింగ్ లో ఆమె ఏడ్చింది, చేయనన్నారు.. కానీ చివరికి.!!

తిరిగి చెన్నైలో రజనీకాంత్ ఆరగెంట్ క్యారెక్టర్(పొగరుబోతు నీలాంబరి పాత్ర)కి మీనా ను అనుకున్నాం కదా ఏమయిందని కె.ఎస్.రవికుమార్ అని అడగగా.. స్నేహం కోసం సినిమా షూటింగ్ లో ఓ డైలాగ్ చెప్తున్నప్పుడు ఎందుకో మీనా పొగరుగా కనిపించడం లేదని దర్శకుడు రవికుమార్ రజనీకాంత్ తో అన్నారు. అయితే ఆ పొగరుబోతు పాత్రకి ఎవరైతే బాగుంటుందో మీరే ఆలోచించండని రజినీకాంత్ కె.ఎస్.రవికుమార్ తో అన్నారు. ముందుగా ప్రముఖ నటి నగ్మా ను ఆ పాత్రకి ఎంపిక చేయాలనుకున్నప్పటికీ.. ఆమె ఇతర సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇకపోతే కె ఎస్ రవికుమార్, రమ్యకృష్ణతో అంతవరకు ఒక్క సినిమా కూడా రూపొందించలేదు. కానీ ఆమెతో కె.ఎస్.రవికుమార్ కి పరిచయం ఉంది. ఆ విధంగా “నరసింహా” చిత్రంలోని నీలాంబరి పాత్రకు రమ్యకృష్ణను తీసుకున్నారు.

KS Ravi Kumar : సౌందర్య ముఖం పై రమ్యకృష్ణ కాలు పెట్టే సీన్.. షూటింగ్ లో ఆమె ఏడ్చింది, చేయనన్నారు.. కానీ చివరికి.!!

నరసింహ చిత్రంలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర అవుట్ అండ్ అవుట్ ఆరగెంట్ క్యారెక్టర్. రజినీకాంత్ తో ఇలాంటి రోల్ చేయడానికి ముందుగా రమ్యకృష్ణ ఆలోచించి నప్పటికీ ఆ పాత్రను సవాల్ గా తీసుకుని ఆ చిత్రంలో నటించాలనుకున్నారు. సింపుల్ గా స్టోరీ అవుట్ లైన్..
నరసింహ (రజనీకాంత్) ఒక జమీందారు (శివాజీ గణేశన్) కొడుకు. పట్నంలో చదువుకుని ఊరికి వస్తాడు. తన మేనమామ కూతురైన నీలాంబరి (రమ్యకృష్ణ) గర్విష్టి. ఆమె నరసింహను పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది. కానీ నరసింహకు మాత్రం ఆమె ప్రవర్తన నచ్చదు. నీలాంబరి ఇంట్లో పనిచేసే వసుంధర (సౌందర్య) ను ఆరాధిస్తుంటాడు. ఈ క్రమంలో నరసింహాను పగబట్టిన నీలాంబరి, నరసింహా ప్రేమించే వసుంధరపై తీవ్రమైన ఆవేశంతో ఉంటుంది.

KS Ravi Kumar : సౌందర్య ముఖం పై రమ్యకృష్ణ కాలు పెట్టే సీన్.. షూటింగ్ లో ఆమె ఏడ్చింది, చేయనన్నారు.. కానీ చివరికి.!!

అయితే నరసింహ సినిమా షూటింగ్ సమయంలో… రమ్యకృష్ణ కోపంతో సౌందర్య ముఖంపై తన కాలి పాదంతో… ఏమిటి ఏడుస్తున్నావా? నీ స్థితి ఏమిటి?. నీ పరిస్థితి ఏమిటి..? నువ్వు వెన్నెల్లో గోరుముద్దలు తినుంటావు.. కానీ నేను తలుచుకుంటే చంద్రమండలంలో తినగలను అంటూ… రమ్యకృష్ణ, సౌందర్య చెంపపై తన కాలితో అటు.. ఇటు అనే సన్నివేశం ఉంటుంది. ఈ సన్నివేశాన్ని ముందుగా రామకృష్ణకు చెప్పడంతో… సౌందర్యను అలా కాలుతో అనడం ఇబ్బందిగా ఫీల్ అయింది. కానీ దర్శకుడు ఒత్తిడి చేయడంతో అలా నేను చేయనని ఏడ్చింది.

KS Ravi Kumar : సౌందర్య ముఖం పై రమ్యకృష్ణ కాలు పెట్టే సీన్.. షూటింగ్ లో ఆమె ఏడ్చింది, చేయనన్నారు.. కానీ చివరికి.!!

చివరికి సౌందర్య, దర్శక నిర్మాతలు చెప్పడంతో ఆ సన్నివేశాన్ని చేయడానికి రమ్యకృష్ణ ఒప్పుకున్నారు. నీలాంబరి పాత్ర సినిమాకి హైలెట్ గా నిలిచింది. ఒక విధంగా చెప్పాలంటే తెలుగులో అద్భుత విజయాన్ని సాధించిన “బాహుబలి” చిత్రంలో రమ్యకృష్ణ శివగామి పాత్ర రావడానికి నరసింహ చిత్రంలోని నీలాంబరి పాత్ర అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. నరసింహ సినిమాలో రజనీకాంత్, రమ్యకృష్ణ కాంబినేషన్ బాగా వచ్చిందని ఆనాటి నరసింహ సినిమా ‌షూటింగ్ విశేషాలను ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు కె.ఎస్.రవికుమార్ చెప్పుకొచ్చారు.

Advertisement

Featured

Supritha: తప్పకుండా మా అమ్మకు రెండో పెళ్లి చేస్తాను.. సుప్రీత కామెంట్స్ వైరల్!

Published

on

Supritha: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి సురేఖ వాణి ఒకరు. ఈమె ఎన్నో సినిమాలలో ఎన్నో విభిన్నమైనటువంటి పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు అయితే ఇటీవల కాలంలో సురేఖ వాణి కాస్త సినిమాలను తగ్గించారనే చెప్పాలి. ఇలా సినిమాలకు దూరమైన ఈమె తన కుమార్తెతో కలిసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సందడి చేస్తూ ఉంటారు.

Supritha: నాన్నకు తలకొరివి నేనే పెట్టా… అమ్మకు రెండో పెళ్లి చేయాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన సుప్రీత!
Supritha: నాన్నకు తలకొరివి నేనే పెట్టా… అమ్మకు రెండో పెళ్లి చేయాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన సుప్రీత!

ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సురేఖ వాణి గురించి తరచూ ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈమె త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతుంది అంటూ గతంలో వార్తలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. 2019వ సంవత్సరంలో సురేఖ వాణి భర్త సురేష్ తేజ మరణించారు అప్పటినుంచి తన కుమార్తెతో కలిసి ఒంటరిగా ఉంటున్నారు.

ఇలా కూతురితో కలిసి ఒంటరిగా ఉన్నటువంటి ఈమె రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను గతంలో ఈ తల్లి కూతుర్లు ఇద్దరు కూడా ఖండించేశారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సురేఖ వాణి కుమార్తె సుప్రీత మరోసారి తన తల్లి రెండో పెళ్లి గురించి కామెంట్స్ చేశారు.

Advertisement

మంచి అంకుల్ దొరికితే..
ఈ సందర్భంగా సుప్రీత మాట్లాడుతూ తన తల్లికి రెండో పెళ్లి చేస్తానని తెలిపారు. అయితే అమ్మకు అబ్బాయిలు సరిపోరని అంకుల్స్ అయితే సరిపోతారని ఈమె తెలిపారు తనని మంచిగా చూసుకునే అంకుల్ కనుక దొరికితే తనకు రెండో పెళ్లి చేస్తాను అంటూ ఈ సందర్భంగా సుప్రీత చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Radha: ఆ పాటకు చిరుతో డాన్స్ చేయాలంటే కష్టంగా అనిపించింది: రాధా

Published

on

Radha: తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి రాధా ఒకరు. ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా తమిళంలో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించినటువంటి రాధ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. అయితే బుల్లితెరపై నీతోనే డాన్స్ కార్యక్రమానికి ఈమె జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

ఇలా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినటువంటి రాధా ఇటీవల ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె సినీ కెరియర్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అయ్యాయి. మీ మొదటి సినిమా చిరంజీవి గారితో ఏది అనే ప్రశ్న ఆలీ అడగడంతో రాధా సమాధానం చెబుతూ చిరంజీవి గారితో కలిసి గుండా అనే సినిమాలో మొదటిసారి నటించానని తెలిపారు.

నిజాయితీపరులు..

Advertisement

ఇక ఆయనతోపాటు నేను సమానంగా డాన్స్ చేసేదాన్ని నిర్మాతల డబ్బు నష్టపోకూడదు అన్న ఉద్దేశంతోనే సింగిల్ టేక్ లో ఎలాంటి స్టెప్స్ అయినా కూడా చేసేస్తానని తెలిపారు. కానీ యముడికి మొగుడు సినిమాలో అందం హిందోళం అధరం తాంబూలం పాటకి మాత్రం చిరంజీవితో పాటు డ్యాన్స్ చేయడం కష్టంగా అనిపించినట్లు రాధ గుర్తు చేసుకుంది. చిరంజీవి మంచివారు మాత్రమే కాదు నిజాయితీపరులు. మా ఇద్దరి మధ్య ఎప్పుడూ డ్యాన్స్ విషయంలో పోటీ ఉండేదని ఆ పోటీ ఉన్నప్పుడే సినిమా కూడా అద్భుతంగా వస్తుందంటూ ఈమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ramcharan: జరగండి పాట కోసం అన్ని కోట్లు ఖర్చు చేశారా.. అయినా ఫలితం లేకుండా పోయిందా?

Published

on

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఈయన నటించిన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరోగా గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ సొంతం చేసుకున్నటువంటి రామ్ చరణ్ తదుపరి సినిమాలన్నింటిని కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.

ప్రస్తుతం ఈయన శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా సినిమా తర్వాత బుచ్చిబాబు అనంతరం సుకుమార్ వంటి స్టార్ డైరెక్టర్ల సినిమాలలో రామ్ చరణ్ బిజీ కాబోతున్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రాబోతున్నటువంటి గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఇటీవల చరణ్ పుట్టినరోజు సందర్భంగా అప్డేట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి జరగండి జరగండి అనే పాటను విడుదల చేశారు. అనంత శ్రీరామ్ రాసినటువంటి ఈ పాటను విడుదల చేయగా ఈ పాటకు అనుకున్న స్థాయిలో వ్యూస్ రాలేదని చెప్పాలి. ఈ పాట పట్ల మెగా ఫాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

18 కోట్లు ఖర్చు..

రామ్ చరణ్ వంటి స్టార్ హీరోకి పడాల్సిన పాట కాదు అంటూ కామెంట్లో పెడుతున్నారు. ఇక ఈ పాట కోసం ఏకంగా 18 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. ఈ స్థాయిలో ఖర్చు చేసిన సినిమాలోని ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా లేకపోవడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!