Connect with us

Featured

KTR : స్కెచ్ గీసిన కేటీఆర్.. ఏంటిది వేళ కాని వేళలోనా?

Published

on

తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని అప్పుడెప్పుడో ఓ సినీ కవి చెప్పారు. ఈ విషయాన్ని కాస్త ఒంట బట్టించుకుంటే బాగుండేది.. లేదు ఆలస్యం.. అమృతం.. విషం అన్నారు కదా… దానినైనా అర్థం చేసుకుని తొందరపడి ఉంటే బాగుండేది. అటు ఇటు కానీ సమయంలో తొందరెందుకు? ఏంటిది సూక్తుల మీద సూక్తులు? ఇంతకీ ఎవరి గురించి అంటారా? ఇంకెవరి గురించి మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి. ఆయనో స్కెచ్ వేశారు. వేసిన స్కెచ్ మంచిదే. కానీ చాలా ఆలస్యమైంది.. చాలా తొందరపడుతున్నారు.. అటు ఇటు కానీ సమయంలో స్కెచ్ గీశారు. మళ్లీ మొదలు పెట్టేశాం అంటారా? అసలు ఏంటా స్కెచ్? దాని వల్ల చేకూరే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు గీయడం వలన అభ్యంతరం ఏంటి? అంటే ఈ ఆర్టికల్‌పై ఓ లుక్ వేయాల్సిందే..

Advertisement

ట్రెండ్ సెట్ చేసింది వైఎస్సే..

పాదయాత్ర.. ఎన్నికల సమయంలో ఇదొక ట్రెండ్.. ఈ ట్రెండ్‌ను సెట్ చేసింది మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి అనడంలో సందేహం లేదు. ఈ పాదయాత్రను నిర్వహించి వైఎస్ ఏకంగా సీఎం పీఠంపై కూర్చున్నారు. ఇక ఆ తరువాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే దారి పాదయాత్ర.. కట్ చేస్తే సీఎం పీఠం. ఏపీలో ప్రస్తుత మంత్రి నారా లోకేష్ సైతం ఎన్నికలకు ముందు పాదయాత్ర చేశారు. తను మంత్రయ్యారు.. తండ్రిని సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. పాదయాత్ర అనేది రాజకీయ నాయకులకు సంబంధించి పవర్‌ఫుల్ మంత్రం. ఇప్పుడు ఈ మంత్రాన్ని కేటీఆర్ పఠించాలని అనుకుంటున్నారు. మీరే చెప్పండి.. ఆలస్యమైందా.. కాలేదా? ఎన్నికలకు ముందు చేస్తే జనంలో బాగా నోటెడ్ అవుతారు.. జనం సమస్యల పరిష్కారంపై భరోసా ఇచ్చినట్టుగానూ అవుతుంది. దీనికోసం నాలుగేళ్లు ఆగాలి కదా.. మరి కేటీఆర్ ఎందుకు ఇంత తొందరపడుతున్నట్టు. వేళగాని వేళ ఏ మంత్రమైనా సరే పఠిస్తే ప్రయోజనం ఉంటుందా? దానికో నిర్ధిష్ట సమయం.. సందర్భం ఉంటుంది.

రీకాల్ చేసేంత డెవలప్ చెందలేదు కదా?

అయితే ఈ మంత్రం ఇప్పటి వరకూ ప్రతిపక్షంలో ఉన్నవారు మాత్రమే పఠించారు కాబట్టి కేటీఆర్ ఎన్నికలకు ముందు పఠించినా ప్రయోజనం ఉండేది కాదేమో. ఎన్నికలకు ముందు అది కూడా అధికార పార్టీ నేత పాదయాత్ర అంటే జనం ఎలా రిసీవ్ చేసుకునేవారో తెలిసేది. ఇప్పుడు రిసీవ్ చేసుకున్నా ప్రయోజనం శూన్యం. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2025 జనవరి లేదా ఫిబ్రవరి మొదటి వారంలో కేటీఆర్ పాదయాత్ర చేస్తారని గులాబీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కేటీఆర్ షెడ్యూల్ అంతా ఖరారవుతోందట. అయినా సరే టూ ఎర్లీ కదా.. 2028లో పాదయాత్ర చేస్తే బాగుంటుందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. బీఆర్ఎస్ ఆలోచనా విధానం మరోలా ఉంది. కాంగ్రెస్ ఆరు నెలల పాలనలో నిరుద్యోగులు, రైతులు, కరెంట్ కష్టాలవంటివి బీభత్సంగా పెరిగి పోయాయి. కాబట్టి వాటిని జనాల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. తీసుకెళ్లి మాత్రం ఇప్పుడేం చేస్తుంది? ఏం సాధిస్తుంది? ఎన్నుకున్న నేతలను రీకాల్ చేసేంత డెవలప్ అయితే మనం చెందలేదు కదా అంటారా? అయితే కేడర్‌లో ఎంతో కొంత ఉత్సాహాన్ని అయితే తీసుకురావచ్చు. బీఆర్ఎస్‌ దీపం పూర్తిగా కొండెక్కకుండా కాస్త చమురు పోసే యత్నం. అంతకు మించి గులాబీ బాస్ కేసీఆర్.. తన కుమారుడిని వచ్చే ఎన్నికల్లో సీఎం పీఠంపై కూర్చోబెట్టే యోచన అని కూడా అంటున్నారు. ఇక చూడాలి ఏం జరుగుతుందో..

Advertisement

Advertisement

Featured

Actor Fish venkat: దయనీయ స్థితిలో నటుడు ఫిష్ వెంకట్… పట్టించుకోని కొడుకులు!

Published

on

Actor Fish venkat:మంగిలంపల్లి వెంకటేశ్ అంటే గుర్తుకు రావ‌డం క‌ష్ట‌మే కానీ ఫిష్ వెంక‌ట్ అందరికీ టక్కున గుర్తుకు వస్తారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆది సినిమా ద్వారా ఈయన నటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అయితే ఎన్నో సినిమాలలో కామెడీ పాత్రలలో నటించడం మరికొన్ని సినిమాలలో విలన్ పాత్రలలో కూడా నటించారు.

Advertisement

ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలు సినిమాలలో నటించే ప్రేక్షకులను మెప్పించిన ఫిష్ వెంకట్ ఇటీవల కాలంలో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వెంకట్ కేవలం ఇంటికి మాత్రమే పరిమితమయ్యారు అయితే తాజాగా ఈయన ఆరోగ్య పరిస్థితి తెలిసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

చాలా రోజుల తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన తన కష్టాల గురించి తెలిపారు. కొన్ని సమస్యల క్రితం తన కాలికి చిన్న దెబ్బ తగిలిందని తెలిపారు. అయితే అప్పటికి తనకి బీపీ షుగర్ ఉండడంతో ఇన్ఫెక్షన్ ఎక్కువ కావటం వల్ల సర్జరీ చేశారని అయినప్పటికీ తన కాలిపై చర్మం మొత్తం ఊడిపోతుందని తద్వారా తనకు నడవడానికి కూడా కుదరడం లేదని తెలిపారు.

చికిత్స కోసం లక్షలు ఖర్చు..
మరోవైపు కిడ్నీ ఫెయిల్యూర్ కావడంతో డయాలసిస్ చేయించుకుంటున్నానని అయితే తనకి ఇప్పటికీ సినిమా అవకాశాలు వస్తున్న ఆరోగ్యం సహకరించకపోవడంతో తాను నటించలేదని తెలిపారు. ఇక డయాలసిస్ కోసం లక్షలు ఖర్చు చేయాల్సి ఉందని తన కొడుకులు కూతురు ఆర్థికంగా ఎంతో మంచిగా ఉన్నప్పటికీ తనకు మాత్రం సహాయం చేయడం లేదని తెలిపారు. ఎవర్ని చేయి చాచి అడగలేను అంటూ ఫిష్ వెంక‌ట్ భావోద్వేగానికి గుర‌య్యారు. దీంతో సాయం కోసం ఎదురుచూస్తున్న ఫిష్ వెంక‌ట్ ను టాలీవుడ్ ప్ర‌ముఖులు ఆదుకోవాలి అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Ambulance: ఘోరం… ఆంబులెన్సులో మహిళకు లైంగిక వేధింపులు.. నిండు ప్రాణాన్ని బలి తీశారుగా?

Published

on

Ambulance: మనకు ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే స్పందించి సరైన సమయంలో చికిత్స అందడం కోసం అంబులెన్స్ కు ఫోన్ చేస్తాం వారు కూడా మన ప్రాణాలను నిలబెట్టడానికి వారి ప్రాణాలను కూడా లెక్కచేయరు కానీ ఓ అంబులెన్స్ డ్రైవర్ తన వృత్తిని మరిచిపోయి అంబులెన్స్ లో ఉన్నటువంటి ఓ మహిళ పట్ల లైంగిక వేధింపులకు దిగారు. దీంతో పేషంట్ గా ఉన్న ఆమె భర్త ప్రాణాలను వదిలిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది.

Advertisement

పూర్తి వివరాలలోకి వెళ్తే..ఈ ఘటన లోరి ఘజిపుర్‌లో చోటుచేసుకుంది. మహిళ భర్త అనారోగ్యంతో బాధపడుతున్న తరుణంలో చికిత్స నిమిత్తం ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. అయితే అక్కడ తగినంత డబ్బు చెల్లించలేకపోవడంతో తిరిగి తన భర్తను ఇంటికి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక ప్రైవేట్ అంబులెన్స్ ను మాట్లాడి తన భర్తను అందులో ఎక్కించి ఇంటికి తీసుకు వెళుతున్నారు.

మార్గమధ్యమంలో అంబులెన్స్ డ్రైవర్ తన హెల్పర్ ఆ మహిళ పట్ల లైంగిక వేధింపులకు గురి చేశారు. తనని ముందు సీట్లో కూర్చోవాలని బెదిరించారు. అంతేకాకుండా ఆమెను లైంగికంగా వేధించడంతో ఆంబులెన్స్ లో ఉన్నటువంటి తన భర్త తన సోదరుడు పెద్ద ఎత్తున అరవడంతో ఆంబులెన్స్ డ్రైవర్ ఆ మహిళ దగ్గర 10000 రూపాయలు విలువ చేసే బంగారం లాక్కొని పేషంటును మార్గమధ్యమంలోనే వదిలేసి ఆక్సిజన్ మాస్క్ కూడా తీసుకొని వెళ్ళిపోయారు.

ఆక్సిజన్ తొలగించి..
ఇలా ఆక్సిజన్ తొలగించడంతో సదరు మహిళ భర్త ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. అప్పటికే వేరే అంబులెన్స్ కు ఫోన్ చేసిన ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అంబులెన్స్ డ్రైవర్ తీరుపట్ల నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఇలాంటి వారికి కఠినంగా శిక్షించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Vijayawada Floods: విషాదం..నలుగురిని కాపాడాడు… వరదల్లో కొట్టుకుపోయాడు?భార్య 8 నెలల గర్భిణి!

Published

on

Vijayawada Floods: ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలలో కురిసిన వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్లో విజయవాడ మొత్తం నదులను తలపిస్తోంది. భారీగా కురిసిన వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లడంతో విజయవాడ మొత్తం నీటిలో మునిగిపోయింది. దీంతో ఎంతోమంది అవస్థలు పడుతున్నారు.

Advertisement

ఈ వరదల కారణంగా ఎంతో ప్రాణ నష్టం ఆస్తి నష్టం కూడా జరిగింది. సరైన సమయంలో కనీసం తాగడానికి నీళ్లు లేక ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా హృదయ విదారక ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే ఈ వరదలలో ఎంతో మంది ఇతరులను రక్షించి వారు ప్రాణాలను కోల్పోయిన సంఘటనలను మనం చూస్తున్నాము.

కృష్ణలంకకు చెందిన పలిశెట్టి చంద్రశేఖర్‌(32)కు సింగ్‌నగర్‌లో డెయిరీఫాం ఉంది. ఆయనతో పాటు ఇద్దరు సోదరులు మరో ఇద్దరు డైరీ ఫామ్ లో పనిచేసే వర్కర్లు ఈ వరదల్లో చిక్కుకున్నారు. అయితే ఆ నలుగురిని చంద్రశేఖర్ రక్షించారు. ఇక తన ఫామ్ లో 50ఆవులను తాళ్లతో కట్టేసి ఉంటే వాటన్నింటినీ కూడా విడదీసి తాను కూడా సురక్షితంగా బయటకు రావడం కోసం షెడ్ పైకి వెళ్లడానికి ప్రయత్నం చేశారు.

నలుగురికి ప్రాణదానం..
ఇలా షెడ్ పైకి ఎక్కుతున్న సమయంలో కాలుజారి కింద పడటంతో ఆయన వరదల్లో కొట్టుకుపోయి మరణించారు. అయితే తన డైరీ ఫార్మ్ దగ్గరలోనే తన మృతదేహం కనిపించడంతో తన కుటుంబ సభ్యులు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే చంద్రశేఖర్ కు రెండు సంవత్సరాల క్రితం వివాహం కాగా ప్రస్తుతం తన భార్య 8 నెలల గర్భిణీ. ఇలా తమ ప్రాణాలను రక్షించి చంద్రశేఖర్ ప్రాణాలను కోల్పోవడంతో తన సోదరులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!