మనిషికి డబ్బు ఎంత అవసరమో.. ఆరోగ్యం కూడా అంతే అవసరం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే.. మానవుడు డబ్బు వెనకాల పరుగెడుతూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఫలితంగా సంపాదించిన డబ్బు అంతా రోగాలకు పెడుతున్నాడు. ఇలా ప్రస్తతం ప్రతీ వ్యక్తి జీవితంలో ఇలానే జరుగుతుంది. అయితే కొంతమంది పనుల్లో బిజీగా ఉండి రాత్రి వేళ సమయానికి అన్నం తినరు.

రాత్రి 8 గంటల సమయంలో తినాల్సింది.. 10 గంటల సమయంలో తింటాడు. ఇలా నిద్రపోయే సమయానికి కంటే ముందే 3 గంటల ముందు తింటే మంచిదని ఒక పరిశోధన ద్వారా వెల్లడైంది. అలా తింటేనే తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాగలదు. లేదంటే అనేక అనర్థాలు జరగనున్నాయి. ముఖ్యంగా ఉబకాయం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ ప్రకారం.. నిద్రవేళలో ఆహారం తీసుకోవడం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం పెరుగుతుందని తెలిపింది.
దీంతో పాటు అధిక రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన పరిశోధన ప్రకారం.. రాత్రి ఆలస్యంగా తినడం వల్ల అధిక బీపీ, మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుందని తెలిపింది. కాలిఫోర్నియా లాస్ ఏంజిల్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఎలుకలపై చేసిన పరిశోధనలో నిద్రవేళలో ఆహారం తిన్న ఎలుకల జ్ఞాపకశక్తిపై తీవ్ర ప్రభావితం చూపాయంట.
అలాగే నేర్చుకునే సామర్థ్యం కూడా తగ్గిపోతుందని కనుగొన్నారు. ఈ ఎలుకలలో జ్ఞాపకశక్తి కోసం ఏర్పడే అణువులు చాలా ప్రభావితమయ్యాయంట. ఇంకా జీవక్రియ మందగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రకమైన వ్యాధుల శరీరంపై దాడి చేసే ప్రమాదం ఉంటుంది. కనుక డిన్నర్ ను సమయానికి చేయాలి.. లేదంటే పైన చెప్పిన అనర్థాలు తప్పవు.

































