Amardeep: అమర్ దీప్ బుల్లితెర నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. బిగ్ బాస్ కార్యక్రమంలో భాగంగా అమర్ రన్నర్ గా నిలిచి బయటకు వచ్చారు అయితే ఫినాలే రోజు పల్లవి ప్రశాంత్ అభిమానులు ఈయన కారు పై దాడి చేసిన ఘటన మనకు తెలిసిందే.

ఇక ఈ విషయం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది ఇక బిగ్ బాస్ తర్వాత అమర్ ఇటీవల వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. తాజాగా ఈయనను తన భార్య తేజస్వినిని మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ సీరియల్ నటి శోభా శెట్టి ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా బిగ్ బాస్ విశేషాలు గురించి కూడా మాట్లాడారు.
తాజాగా ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన చిన్న వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో భాగంగా కారుపై దాడి జరిగిన తర్వాత కారు రిపేరు గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో మాట్లాడారని తెలుస్తుంది. పల్లవి ప్రశాంత్ అభిమానులు కారుపై దాడి చేసిన తర్వాత రిపేరు కోసం ఎంత మొత్తంలో ఖర్చయింది అంటూ శోభ శెట్టి ప్రశ్నించారు.
నాలుగు లక్షలు ఖర్చు..
ఈ ప్రశ్నకు అమర్ సమాధానం చెబుతూ తనకు సుమారు నాలుగు లక్షల రూపాయల వరకు ఖర్చయింది అంటూ సమాధానం ఇచ్చారు. ఇలా పల్లవి ప్రశాంత్ అభిమానులు అత్యుత్సాహం కారణంగా ఈయన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పెద్ద ఎత్తున రాళ్లతో కారుపై దాడి చేయగా అద్దాలని పగిలిపోయి ఆ రాళ్లు కారు లోపల ఉన్నటువంటి అమర్ అలాగే తన తల్లి భార్యలకు కూడా తగలాయి అంటూ పలు సందర్భాలలో వెల్లడించారు.































