Pitapuram: పిఠాపురం ఎన్నికలపై అందరి ఆసక్తి నెలకొంది ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సిపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వంగా గీత ఎన్నికలలో పోటీ చేయబోతున్నారు అలాగే కూటమి తరపున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీకి దిగారు. అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయడం స్థానిక టిడిపి నేతలకు కార్యకర్తలకు ఏమాత్రం నచ్చలేదు దీంతో అక్కడ టిడిపి నేతగా ఉన్నటువంటి వర్మ ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ప్రకటించారు.

ఇక బాబు తనని బుజ్జగించి తనకు అధికారంలోకి వచ్చిన తర్వాత పదవి ఇస్తానని చెప్పి బుజ్జగించారు దీంతో తప్పనిసరి పరిస్థితులలో జనసేనకు మద్దతు తెలిపారు కానీ ఎన్నికలు మరొక నాలుగు రోజులలో ఉన్నాయి అన్న నేపథ్యంలో పిఠాపురంలోని జనసేన గెలుపు పై రోజురోజుకు నమ్మకాలు తగ్గిపోతున్నాయి అక్కడ పవన్ కళ్యాణ్ ఓటమి తప్పదు అనే మాటలు జనసేన కార్యకర్తలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి.
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమికి వైసీపీ నేతలు కాకుండా టిడిపి అధినేత వర్మ కారణమవుతున్నారని తెలుస్తుంది. ఈయన జనసేన రక్తం పూసుకొని మరి ప్రచార కార్యక్రమాలలో పాల్గొనడం లేదు ఏదో చెప్పారంటే పాల్గొనాలి కనుక పాల్గొంటున్నారు అంతే నిజానికి జనసేన తరఫున పవన్ కళ్యాణ్ పోటీ చేసి గెలిస్తే కనుక రాబోయే రోజులలో తనకు అక్కడ మనుగడ ఉండదు అనే వాస్తవాన్ని గ్రహించిన వర్మ పెద్దగా జనసేనకు సపోర్ట్ చేయడం లేదని తెలుస్తోంది
టీడీపీకి మనుగడ ఉండదా..
ఇక వర్మను అనుసరిస్తూ టిడిపి నాయకులు కూడా తన బాటలోనే పయనిస్తున్నారు దీంతో జనసేనకు వర్మ మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయడం లేదని విషయం తెలిసిన కార్యకర్తలు సైతం వర్మ బాటలోనే జనసేనకు వ్యతిరేకంగా ఓట్లు వేసే అవకాశాలు చాలా ఉన్నాయని తెలుస్తుంది అయితే బయటకు వర్మ ఇవన్నీ చెప్పకపోయినా పిఠాపురంలో వాస్తవ పరిస్థితి ఇదేనని స్పష్టంగా అర్థమవుతుంది మరి పిఠాపురంలో జనసేన పరిస్థితి ఏంటి అనేది మరి కొద్ది రోజులలో తెలియనుంది.





























