తల్లిదండ్రులు ఇంకా బతికే ఉన్నా, పిల్లలు సొంత ఆస్తి కోసం తోడబుట్టిన వారితో పోట్లాడుకోవడం ఏంటి? ఈ విషయంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రులు బ్రతికి ఉన్నంత వరకూ పిల్లలు ఆస్తి కోసం వాటా అడగకుండా చట్టం ఉంటే బాగుండేదని హైకోర్టు అభిప్రాయపడింది.

44 గజాల స్థలం కోసం కోర్టు మెట్లు ఎక్కిన కుటుంబం కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. 264 గజాల స్థలం కోసం ఆరుగురు కుటుంబసభ్యులు హైకోర్టులో పిటిషన్ వేయగా, ఒక్కొక్కరికి 44 గజాల స్థలం మాత్రమే వస్తుందని, అందులో ఇల్లు కూడా కట్టుకోలేరని న్యాయమూర్తి అన్నారు.
తల్లిదండ్రులు బ్రతికున్నంత వరకు పిల్లలు ఆస్తిలో వాటా అడగకుండా చట్టం తీసుకువచ్చే అధికారం ఉంటే బాగుండేదని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. తమ తల్లిదండ్రుల ఆస్తిపై పిల్లలు ఎందుకు అధికారం చెలాయిస్తున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
ఈ విషయంలో చట్టం మార్పులు తీసుకురావాలని హైకోర్టు సూచించింది. తల్లిదండ్రులు బ్రతికి ఉన్నంత వరకు పిల్లలు ఆస్తిలో వాటా అడగకుండా చట్టం ఉంటే కుటుంబ సంబంధాలు మరింత బలపడతాయని, కుటుంబ సమగ్రత కాపాడుకోవచ్చని భావిస్తున్నారు.






























