సూర్యపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. హుజూర్నగర్ బూరుగడ్డ మండలంలో ఓ ప్రేమికుల జంట ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మౌనిక అనే యువతి గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్య పాల్పడింది. ఆమె మరణాన్ని తట్టుకోలేని ప్రియుడు పవన్ కూడా పురుగుల మందు తాగి బలవన్మరణం చెందాడు. ప్రేమికులిద్దరూ బలవన్మరణానికి పాల్పడడంతో బూరుగడ్డలో విషాద చాయలు అలుముకున్నాయి. పవన్ పురుగుల మందు సేవిస్తూ తీసుకున్న సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

ఒకరినొక్కరి గాఢంగా ప్రేమించుకున్న పవన్,మౌనికిల వివాహానికి పెద్దలు అడ్డు చెప్పడంతో వారి ఈ దారుణానికి పాల్పడంటూ తెలుస్తోంది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
































