Lyricist Jonnavitthula : తెలుగు సినిమాకు సాహిత్యం అందిస్తూ గుర్తింపు తెచ్చుకున్న జొన్నవిత్తుల గారు ఎన్నో ప్యారడి పాటలను రాశారు. ఇక సినిమాల్లో పాటలు రాయడమే కాకుండా తెలుగు భాషకు సేవ చేస్తున్నారు, అలా పద్యాలు రాస్తుంటారు. వివాదరహితంగా తన పని తాను చూసుకునే జొన్నవిత్తుల గారు మంచు విష్ణు సినిమా ‘దేనికైనా రెడీ’ విషయంలో వివాదాస్పదం అయ్యారు. బ్రాహ్మణులను కించపరిచారంటూ టీవీ డిబేట్లలో పాల్గొని వాదించడంతో బాగా వైరల్ అయ్యారు. ఇక తెలంగాణ కవి ఐలయ్య గారు రాసిన పుస్తకంలో అగ్రకులాలను కించపరచడం గురించి కూడా ఆయన పోరాడారు.

బ్రాహ్మణులు, కోమట్లను అనడం నచ్చలేదు…
ఐలయ్య గారు అయన పుస్తకంలో బ్రాహ్మణులు సోమరులని, కోమట్లు స్మగ్లర్లు అంటూ రాసారు. అది అభ్యంతరకరం అని నేను చెప్పినందుకు వాదించారు కానీ చివరకు వెనక్కి తగ్గారు అంటూ తెలిపారు. కోమటి వారిని ముఖ్యంగా స్మగ్లర్లు అనడం నచ్చలేదు. వాళ్ళు ఇండియా ఆర్థిక మూలాలు పటిష్టం అవడానికి కారకులు. మొదటి నుండి అప్పు ఇచ్చి సరుకులు అమ్మారు. ఇక ఇప్పుడు బ్యాంకులు ఉన్నాయి కానీ పూర్వం అవి లేని సమయంలో వడ్డీ వ్యాపారం చేసి ఆర్థిక వ్యవస్థను నడిపారు. అలాంటి వాళ్ళను అలా స్మగ్లర్లు అనడం సమంజసం కాదు.

ఇక బ్రాహ్మణులు సోమరులైతే మరి గిడుగు రామ్మూర్తి పంతులు గారు, ప్రకాశం పంతులు గారు, పింగళి వెంకయ్య గారు, మంగల్ పాండే వీళ్లంతా ఎవరు ఏం చేయలేదా దేశానికి అంటూ అందుకే అభ్యంతరం చెప్పాను అంటూ తెలిపారు. ఇక బాహుబలి సినిమా సమయంలో మొదట రైటర్ గా నన్ను పెట్టుకున్నారు. విజయేంద్ర ప్రసాద్ గారు నన్ను పెట్టుకోమని సలహాలు ఇచ్చారట. ఒక మూడు నెలలు కథా చర్చలు అన్నీ సాగాయి కానీ ఆ తరువాత వాళ్ళు ఒక రెండు మూడేళ్లు మాతోనే ఉండాలి అని చెప్పేసరికి నా సభలకు మిగిలిన పనులకు ఇబ్బంది పడాల్సి వస్తుందని నేనే రానని చెప్పేసాను. ఆ మూడు నెలలు పనిచేసినందుకు నాకు మంచి రెమ్యూనరేషన్ ఇచ్చారు అంటూ తెలిపారు.































