అక్టోబర్ 10 న మా ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఒకరిపై ఒకరు తీవ్రంగా ఆరోపణలు చేసుకుంటున్నారు. మొన్నటి వరకు కలిసి ఉన్న నటులు, నటీమనుల మధ్య ప్రస్తుతం ఒకరంటే ఒకరిపై పచ్చిగడ్డి వేస్తే భగ్గుమన్నట్లు అవుతోంది. ఈ ఎన్నికల్లో మొదటి నుంచి మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ల మధ్యే పోటీ ఎక్కువగా ఉంటుందని భావించారు.

ప్రస్తుతం కూడా అలానే సాగుతోంది. మధ్యలో బండ్ల గణేష్, సీవీఎల్ నరసింహారావు పోటీలో నిలబడ్డా.. వారి నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. చివరకు మంచు ప్యానల్, ప్రకాశ్ రాజ్ ప్యానల్ మాత్రమే నిలిచారు. ప్రకాశ్ రాజ్ ప్యానల్ పై మంచు ప్యానల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
మంచు ప్యామిలీ అంటూ.. వ్యక్తిగతంగా విమర్శిస్తే బాగోదని.. తన కుటుంబం పేరు తీస్తే.. మీ పేరు తర్వాత గారు ఉండదని హెచ్చరించారు. తాను మా ఎన్నికలలో అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాను. తనకు ఓటు అడిగే హక్కు ఉంటుందని.. మీకు దమ్ముంటే.. మగాడు అయితే మీరు విమర్శించే సమయంలో కేవలం తన పేరు మాత్రమే ప్రస్తావించండి అంతేకానీ.. అక్క, తమ్ముడు, నాన్నను ఇందులోకి లాగకండి అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు.
నా కోసం నా కుటుంబం ఓటు అడగవచ్చు అంటూ స్పష్టం చేశారు. మీరు ఓటు అడగడానికి వెళ్లినప్పుడు గిరిబాబు ఇచ్చిన క్లాస్ సరిపోలేదా అంటూ వ్యంగంగా విమర్శించారు. అక్టోబర్ 10 తర్వాత అందరం ఒకే దగ్గర ఉండి పని చేయాల్సి వస్తుంది.. మర్యాదగా మాట్లాడితే మంచిదని అన్నారు. అక్టోబర్ 11వ తేదీన ప్రకాశ్ రాజ్ విమానం ఎక్కి వెళ్లిపోతారు.. శ్రీకాంత్ గారు, బెనర్జీ గారు మీరంటే చాలా ఇష్టం.. మన ముఖాలు అక్టోబర్ 10 తర్వాత ఒకరినొకరు చూసుకోవాలి అంటూ అన్నారు. మనమంతా మా కుటుంబం అని .. ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించడం లేదంటూ మంచు విష్ణు అన్నారు.






























