ఉత్తరాదిన సంభవిస్తున్న భూకంపాలు అక్కడి ప్రజలను భయబ్రాంతులను గురించేస్తున్నాయి. ఇటీవల ఢిల్లీ – ఎన్సీఆర్, నోయిడా, బీహార్ తదితర ప్రాంతాల్లో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే గత నెల ఫిబ్రవరిలో కేంద్రపాలిత ప్రాంతమై లడఖ్లో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి. తాజాగా శనివారం కూడా లడఖ్లో భూమి కంపించింది.

శనివారం తెల్లవారుజామున 5.11 గంటలకు భూ ప్రకంపనలు సంభించాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది. ఈ నేపధ్లయంలో లడఖ్ మరియు లేహ్ ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈ భూ ప్రకంపంనలు రావడంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే స్వల్పంగా భూమి కంపించడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదని అధికారులు పేర్కొన్నారు. అయితే ఇటువంటి స్వల్ప భూకంపాలతో ఎటువంటి ప్రమాదం ఉండబోదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడిస్తున్నారు.































