Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఈయన ఏదైనా ఒక సినిమా విడుదల అయింది అంటే ఆ సినిమా గురించి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఉంటారు..

ఈ క్రమంలోనే నిహారిక మొదటిసారి నిర్మాతగా మారి నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకొని కేవలం మూడు రోజులలోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాటలో పయనిస్తుంది. ఇక ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకోవడంతో ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు స్పందిస్తున్నారు.
కంగ్రాట్స్ నిహారిక..
ఈ సందర్భంగా మహేష్ బాబు సైతం సోషల్ మీడియా వేదికగా నిహారిక కమిటీ కుర్రోళ్ళు సినిమా గురించి స్పందిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కంగ్రాట్స్ నిహారిక.. కమిటీ కుర్రోళ్ళు సినిమాకు సంబంధించి మంచి విషయాలను విన్నాను. తొలి చిత్రంతో నిర్మాతగా సక్సెస్గా సాధించిన నిహారిక కొణిదెలకు అభినందనలు. సినిమాలో సక్సెస్లో భాగమైన చిత్ర యూనిట్కు అభినందనలు. త్వరలోనే సినిమా చూస్తా అంటూ ఈయన చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.



























