Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కెరియర్ పరంగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన త్వరలోనే రాజమౌళి సినిమా షూటింగ్ పనులలో బిజీ కాబోతున్నారు.

ఇలా మహేష్ బాబు తన సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉండగా నమ్రత మాత్రం మహేష్ బాబుకు సంబంధించిన విషయాలతో పాటు పిల్లలు, కుటుంబ బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు. అంతేకాకుండా వీరి బిజినెస్ లు అన్నింటినీ కూడా నమ్రతని ఎంతో చక్కగా ముందుకు నడిపిస్తూ ఉన్నారు.
ఇలా మహేష్ బాబు నమ్రత దంపతులు ఇప్పటికే భారీ స్థాయిలో ఆస్తులను సంపాదించారనే సంగతి మనకు తెలిసిందే .వీరు హైదరాబాద్ లో మాత్రమే కాకుండా బెంగళూరు చెన్నై వంటి నగరాలలో మాత్రమే కాకుండా విదేశాలలో కూడా ఆస్తులను కొనుగోలు చేశారని తెలుస్తుంది. ఇక నమ్రతకు సంబంధించి ముంబైలో కూడా పెద్ద ఎత్తున ప్రాపర్టీలు ఉన్నాయట.
ఇకపోతే తాజాగా హైదరాబాదులోని శంకర్ పల్లి సమీపంలో ఈ దంపతులు 2.5 ఎకరాల పొలం కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ పొలం రిజిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి పనులను పూర్తి చేయడం కోసం నమ్రత బుధవారం శంకర్ పల్లి ఎమ్మార్వో ఆఫీస్ కు వచ్చారు. ఇలా ఈమె వచ్చారు అనే విషయం తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకొని ఆమెతో సెల్ఫీలు దిగారు. అలాగే ఎమ్మార్వో ఆఫీస్ లోని సిబ్బంది కూడా నమ్రతతో కలిసి ఫోటోలు దిగారు.


























