టాలీవుడ్ హీరో బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అయితే బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం అఖండ. ఈ సినిమా రేపు అనగా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఇలా ఉంటే వెండితెరపై తనదైన శైలిలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన బాలకృష్ణ ప్రస్తుతం బుల్లితెరపై కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బుల్లితెర ప్రేక్షకులను సైతం అలరిస్తున్నారు.

ప్రస్తుతం బాలకృష్ణ బుల్లితెరపై అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ షో మొదటి ఎపిసోడ్ కు మంచు ఫ్యామిలీ వచ్చి సందడి సందడి చేశారు. అనంతరం ఈ ఫ్యామిలీ రెండవ ఎపిసోడ్ కు టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని పాల్గొన్నారు. ఇదిలా ఉంటే తాజాగా మహేష్ బాబు కూడా ఈ షోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే మహేష్ బాబు ఎపిసోడ్ కి సంబంధించిన అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీన్ని బట్టి చూస్తే త్వరలోనే మహేష్ బాబు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో సందడి చేయబోతున్నారని అర్థమవుతోంది . సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం డిసెంబర్ 4న మహేష్ బాబు బాలకృష్ణ ఒక వేదికపై కనిపించనున్నట్లు తెలుస్తుంది.
ఈ వార్త ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అలా బాలకృష్ణ మహేష్ బాబు అరుదైన కాంబినేషన్ లో రెండు మూడు రోజుల్లో రానుందని తెలిసిన బాలకృష్ణ మహేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆ షో ఎపిసోడ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
































