Mamatha mohandas: మమతా మోహన్ దాస్ తెలుగులో యమదొంగ సినిమాతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా ఈ సినిమాతో ఎంతో మంచి సంపాదించుకున్న ఈమె అనంతరం పలు సినిమాలలో నటించారు. అయితే ఈమె క్యాన్సర్ బారిన పడటంతో సినిమాలకు కాస్త దూరమయ్యారు. ఇలా రెండుసార్లు క్యాన్సర్ నుంచి బయటపడినటువంటి ఈమె ప్రస్తుతం బొల్లి వ్యాధి సమస్యతో బాధపడుతున్నారు.

ఇలా తనని ఎన్ని సమస్యలు వెంటాడినా ఎంతో ధైర్యంతో ఈమె ముందడుగు వేస్తూ ఒకవైపు సినిమాలు మరోవైపు తన ఆరోగ్యాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇకపోతే మమతా మోహన్ దాస్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె గతంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి తెలియజేశారు.
ఇక ఈమె అరుంధతి సినిమాలో నటించే అవకాశాన్ని వదులుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ విషయం గురించి మమత మోహన్ దాస్ మాట్లాడుతూ… తనకు తెలుగు ప్రొడక్షన్స్ గురించి పెద్దగా అవగాహన లేదు. అయితే శ్యాం ప్రసాద్ రెడ్డి గారు తనకు అరుంధతి సినిమాలో అవకాశం కల్పించారు కానీ వారి ప్రొడక్షన్ మంచిది కాదని తన మేనేజర్ చెప్పడంతో నేను ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదు.

Mamatha mohandas:
నాకోసం శ్యాం ప్రసాద్ రెడ్డి గారు దాదాపు 3 నెలల వరకు ఎదురు చూసారని అయితే నేను తప్పుకోవడంతో అనుష్క ఈ సినిమాలో నటించారని తెలిపారు.ఈ సినిమా నుంచి తప్పుకొని రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ సినిమాకు కమిట్ అయ్యాను. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో రాజమౌళి గారు మాట్లాడుతూ అరుంధతి సినిమా వదులుకొని పెద్ద తప్పు చేసారని అనడంతో ఒక్కసారిగా నా గుండె ఆగినంత పని అయింది. అయితే అప్పటికి ఇంకా అరుంధతి సినిమా విడుదల కాలేదు. ఇక ఈ సినిమా విడుదలయి ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.సినిమా గురించి రాజమౌళి గురించి మమతా మోహన్ దాస్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.































