కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నట వారసరాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తెరంగేట్రం చేసిన నటి మంచు లక్ష్మి ప్రసన్న తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని విలక్షణ పాత్రలు వస్తుంది మంచు లక్ష్మి. కానీ అనుకున్న స్థాయిలో అవకాశాలను అందుకోలేక పోతుంది. అయితే ఆమె సామాజిక కార్యక్రమాలు, ఇతర అంశాలపై ప్రత్యక శ్రద్ద చూపిస్తూ ఉంటారు. సామాజిక అంశాల మీద మంచు లక్ష్మి చాలా వేగంగా స్పందిస్తుంది. అంతే కాకుండా అటువంటి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటుంది కూడా. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా మంచు లక్ష్మి చాలా యాక్టివ్ గా ఉంటారు. నిత్యం ఏదోక అంశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.

ప్రస్తుతానికి లాక్ డౌన్ కారణంగా అందరు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ వాటిని వారి సోషల్ ఖాతాలో షేర్ చేసుకుంటున్నారు. ఇలా సెలెబ్రెటీస్ అందరు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచటిస్తున్నరు. మంచు లక్ష్మి కూడా లాక్ డౌన్ సమయంలో తన తండ్రి మోహన్ బాబు ఇంట్లో గడుపుతూ అక్కడి సరదా సంఘటనలు అభిమానులతో షేర్ చేస్తుంది. అలాంటిదే ఈమధ్య వల్ల అమ్మతో మల్లెపూలు పెట్టుకున్న ఫోటో ఒకటి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఆ ఫోటో కింద అమ్మ మల్లెపూలు పెట్టింది, మా తోటలో మల్లెపూలు అని ఇంగ్లీష్ లో రాసింది. దానిలో మల్లె అని పెట్టడానికి బదులుగా మల్లి అని రాయడంతో కొంత మంది నెటిజన్లు దానికి కామెంట్ చేస్తున్నారు. అందులో ఒక నెటిజన్ పెట్టిన కామెంట్ కి సీరియస్ గా తీసుకున్న మంచు లక్ష్మి “పో బే..” అని కౌంటర్ ఇవ్వగా అటు వైపు నుండి “పోవే నీ…” రిప్లై రావడం జరిగింది. ఈ కామెంట్స్ చూసిన వారు నిజంగా అలా మాట్లాడారా.? లేక వాళ్ళిద్దరికి ముందే పరిచయం ఉందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.



































