Manchu Vishnu: బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి రియాలిటీ షోలలో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం అన్ని భాషలలోనూ ప్రసారమవుతూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ క్రమంలోనే తెలుగులో ఈ కార్యక్రమం ప్రస్తుతానికి మారు సీజన్లను పూర్తి చేసుకుంది.

ఇకపోతే త్వరలోనే ఏడవ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సీజన్ గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ కార్యక్రమం మొదటి సీజన్ ఎన్టీఆర్ రెండవ సీజన్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు అనంతరం తదుపరి సీజన్లన్నింటికీ కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు.
నాగార్జున బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్టింగ్ విషయంలో పక్షపాతం చూపిస్తున్నారని ఈయన హోస్ట్ గా నిర్వహిస్తున్న సమయంలో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు.ఈ క్రమంలోనే సీజన్ సెవెన్ కి నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరించరని ఆయన స్థానంలో ఇతర హీరోలు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించబోతున్నారని వార్తలు వచ్చాయి. నాగార్జున స్థానాల్లో బాలకృష్ణ, రామ్ చరణ్, రానా వంటి హీరోల పేర్లు వినిపించాయి.

Manchu Vishnu: మంచు విష్ణుని సంప్రదించిన బిగ్ బాస్ నిర్వాహకులు…
అయితే తాజాగా ఈ జాబితాలోకి మరో హీరో పేరు చేరింది. బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమానికి మంచు విష్ణు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు విష్ణువుని సంప్రదించారని సమాచారం. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మేకర్స్ అధికారిక ప్రకటన తెలియజేయాల్సి ఉంది.



























