టాలీవుడ్ ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10 వ తేదీన జరగనున్నాయి. ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో అధ్యక్ష పదవి కోసం పోటీ చేసే వారు పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యులతో ఎన్నో సమావేశాలు జరగా తాజాగా మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ మా అసోసియేషన్ పుట్టి పాతిక సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది కార్మికులకు అన్నం పెడుతోందని తెలిపారు. చాలా మంది సినిమా హీరోలు అంటే తెరపై చూపినట్లు ఎంతో ఖరీదైన జీవితాన్ని గడుపుతారని భావిస్తారు కానీ ఒక్కసారి మేకప్ తొలగిస్తే మా జీవితాలు కూడా అందరిలాగే సాధారణ జీవితాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు.
మా ఎన్నికలఅధ్యక్ష పదవికి పోటీ చేస్తానని తన తండ్రితో చెప్పినప్పుడు అందుకు తన తండ్రి నీ ఇష్టం అని చెప్పారు. ఎప్పుడూ కూడా నాన్న ముందు అడుగు వేయలేదు. కానీ కొందరు మా నాన్నకు ఫోన్ చేసి విష్ణుని ఎలక్షన్స్ నుంచి తప్పుకొమ్మని ఫోన్ చేశారు. ఎప్పుడైతే అలా ఫోన్ చేశారో అప్పుడే నాన్నగారు సుమారు 700 మందికి ఫోన్లు చేసి విష్ణు ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నారు తనకు ఓటు వేసి తనకు మద్దతుగా నిలబడాలని చెప్పారు.
అదేవిధంగా మీడియాతో మాట్లాడుతూ విష్ణు తను ఇండస్ట్రీకి ఎంతో మందిని పరిచయం చేశానని.. అప్పటి వరకు ఏమీ తెలియని వారిని పి.ఆర్.ఓ లుగా కూడా చేశానని వాళ్లకు ఉద్యోగాలు కూడా కావాలంటే ఫోన్ చేసి కొన్ని ఆర్గనైజేషన్స్ కి ఫోన్ చేసి వారికి ఉద్యోగాలు ఇప్పించాను. ఇప్పటివరకు నా కోసం నేను ఎవరిని ఏమీ అడగలేదు కానీ వారి కోసం అన్నీ చేశాను.
అదేవిధంగా నా స్నేహితులకు పరిచయం చేసి మంచి వాళ్ళని చెప్పడంతో ప్రస్తుతం వాళ్ళు ఇండస్ట్రీలో ఒక లీడింగ్ పి.ఆర్.ఓ లుగా ఉన్నారని ఎప్పుడైతే నేను ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నారని తెలిసిందో అప్పుడు నా స్నేహితులతో ఇప్పుడు మేము వేరే సినిమాలతో బిజీగా ఉన్నాము రాలేమని చెప్పండి అంటూ చెప్పారని ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే మా లో ఎన్నో సవాళ్లు ఉన్నాయని వాటన్నిటినీ ఎదుర్కొనే సత్తా మా ప్యానెల్ కి ఉందని, ఈ ఎన్నికలలో తప్పకుండా తనే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
































