Pitapuram: మరొక వారం రోజులలో ఏపీ ఎన్నికల ఫలితాలు వెలబడుతున్నటువంటి తరుణంలో అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఏపీ ఎన్నికల ఫలితాలు ఒకవైపు అయితే పిఠాపురం ఎన్నికల ఫలితాలు మరో ఎత్తు అనేలాగా ఉన్నాయి. ఇప్పటికే పిఠాపురం ప్రజలందరూ కూడా మా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అంటూ పెద్ద ఎత్తున స్టిక్కర్లను వేయించుకొని చక్కర్లు కొడుతున్నారు.

జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ తప్పకుండా గెలుస్తారనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఎమ్మెల్యే తాలూకా అంటూ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ స్టిక్కర్లతో పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు.
ఇలా జనసేన నాయకులు స్టిక్కర్లతో తిరగడంతో మేమేం తక్కువ కాదంటూ వైసీపీ నేతలు కూడా వంగా గీత ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం అనే స్టిక్కర్లు వేయించుకొని మరి బండ్లపై చక్కర్లు కొడుతున్నారు. ఇంకా ఎన్నికల ఫలితాలకు వారం గడువు ఉండగానే పిఠాపురంలో స్టిక్కర్ వార్ కొనసాగుతూ ఉండడంతో పిఠాపురం కాస్త మరోసారి వార్తలలో నిలిచింది.
కోట్లలో బెట్టింగులు..
మరి జూన్ 4వ తేదీ రాబోయే ఎన్నికల ఫలితాలలో పిఠాపురంలో ఎవరు విజయకేతనం ఎగరు వేస్తారు అన్న విషయంపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. సినీ నటుడు పవన్ కళ్యాణ్ మొదటిసారి పిఠాపురంలో గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడతారా లేకపోతే ఈసారి కూడా ఈయనకి నిరాశ తప్పదా అనేది తెలియాల్సి ఉంది అయితే ఇప్పటికే ఈ విజయం పై కోట్లలో బెట్టింగులు నడుస్తుండటం గమనార్హం.





























