కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4 కోట్ల రేషన్ కార్డులను రద్దు చేసింది. కేంద్రం భారీ సంఖ్యలో రేషన్ కార్డులను రద్దు చేయడానికి ముఖ్యమైన కారణమే ఉంది. అర్హత లేకపోయినా కొందరు రేషన్ పొందుతుండటంతో కేంద్రం వారి కార్డులను రద్దు చేసింది. కేంద్రం రద్దు చేసిన కార్డులన్నీ బోగస్ కార్డులే కావడం గమనర్హం.

కొంద్ అర్హత లేకపోయినా అక్రమంగా రేషన్ పొందుతున్న నేపథ్యంలో కేంద్రం రేషన్ కార్డు కలిగిన కొందరికి షాక్ ఇచ్చింది. కేంద్రం రద్దు చేసిన రేషన్ కార్డులను కలిగి ఉన్నవాళ్లు ఇకపై రేషన్ ను పొందడం సాధ్యం కాదు. దేశంలోని ప్రజలకు ముఖ్యమైన డాక్యుమెంట్లలో రేషన్ కార్డు కూడా ఒకటి ఎవరైతే రేషన్ కార్డును కలిగి ఉంటారో వాళ్లు తక్కువ ధరకే రేషన్ ను పొందవచ్చు. అయితే రద్దైన రేషన్ కార్డులు కలిగి ఉన్నవాళ్లు ఇకపై తక్కువ ధరకే రేషన్ ను పొందలేరు.
కేంద్రం గత కొన్నిసంవత్సరాల నుంచి అక్రమంగా రేషన్ పొందుతున్న వారిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. రేషన్ వ్యవస్థలో అవినీతిని అరికట్టాలనే ఉద్దేశంతో రేషన్ కార్డుల రద్దు దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే చనిపోయిన వారు, ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉన్నవారు, అర్హత లేనివారు కేంద్రం నిర్ణయం వల్ల ఇకపై రేషన్ ను పొందలేరు.
మరోవైపు కేంద్రం చాలా సంవత్సరాల నుంచి రేషన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయించుకోవాలని చెబుతోంది. అయితే రేషన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయించుకోని వాళ్ల కార్డులను కూడా కేంద్రం రద్దు చేసిందని సమాచారం. కేంద్రం ఒకవైపు రేషన్ కార్డులను తొలగిస్తున్నా మరోవైపు అర్హులకు కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనుందని సమాచారం.


































