ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ vs పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ కిషోర్…. అవును మీరు వింటున్నది నిజమే… పీఎం మోడీ ఎలాంటి ప్రకటన చేసినా రాజకీయపరంగా పాలనాపరంగా ఎలాంటి నిర్ణయం ప్రకటించిన దానిని చీల్చి చెండాడే మొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అదే దేశ వ్యాప్తంగా రాజకీయ వ్యూహకర్తగా ఎంతో పేరు ఉన్న ప్రశాంత్ కిషోర్ మాత్రమే. ప్రతి పక్షాల కన్నా కూడా ముందే ప్రశాంత్ కిషోర్ మోడీ నిర్ణయాలపై లోటుపాట్లతో నీరు గార్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంతే కాదు దేశ వ్యాప్తంగా ప్రతి పక్షాల తరపున రంగంలోకి దిగి వారికీ విజయాన్ని చేకూరుస్తున్నాడు. ఒక్కో రాష్ట్రం పీకే గెలుస్తూ సవాలు విసురుతూ ఉంటె మోడీ, షా ద్వయం ప్రతి కార చర్యలకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో భాగంగా మొదట జేడీయూ నుండి పీకేని బయటకు పంపడంలో ఒక అడుగు ముందుకేశారు. జేడీయూ నుండి సాగనంపగా పీకే అక్కడ నుండి పశ్చిమ బెంగాల్ లో తన పాగా వేసి ఇప్పుడు ఆమెను గెలిపించే పనిలో పడ్డారు. మమతా బెనర్జీతో కలిసి బీజేపీ ప్రభుత్వం గుక్క తిప్పుకోకుండా విమర్శలు చేస్తూ మోడీకి కొరకరాని కొయ్యలా తయారయ్యాడు.

కానీ మోడీ షా ద్వయానికి ఇప్పుడు పీకే పూర్తిగా దొరికినట్టే కనిపిస్తుంది. కొన్నాళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని చిత్తు చేసి అరవింద్ కేజ్రీవాల్ కి పట్టం కట్టించిన పీకే లాక్ డౌన్ సమయంలో నిబంధలు అతిక్రమించినట్టు తెలుస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే లాక్ డౌన్ సమయంలో విమానాల్లో ప్రయాణం చేయడం పూర్తిగా నిషేధం అని అందరికి తెలిసిందే. ఇటీవల ఢిల్లీ నుండి మూడు కార్గో విమానాల్లో దేశంలో చాలా ప్రదేశాలకి కొంత సామాగ్రిని తరలించారు. ఈ విమానాలలో ఒక దాంట్లో పీకే ఎవరికీ తెలియకుండా ప్రయాణం చేశారనే వార్తలు వస్తున్నాయి. ఒక వేళ ప్రశాంత్ అలా ప్రయాణించినట్టయితే చట్ట రీత్యా అది నేరమే. ఈ వార్తలను బలపరచడానికి బీజేపీ సైతం తన అస్రాలను ప్రయోగిస్తోంది. ఢిల్లీ నుండి మమతా పిలుపు మేరకే పీకే కార్గో విమానములో ప్రయాణించి పశ్చిమ బెంగాల్ చేరుకున్నారని ఇలాంటి లాక్ డౌన్ సమయంలో ఎలాంటి రోడ్ ప్రయాణం చేయకుండా పీకే మమతా ని ఎలా చేరుకున్నారని ప్రశ్నిస్తుంది.

అంతే కాదు దీనిపై దర్యాప్తునకు కూడా మోడీ ప్రభుత్వం ఆదేశించడం తో విమానయాన సంస్థ వివరాలు సేకరిస్తుంది. ఢిల్లీ మరియు కోల్ కతా విమానాశ్రయాల్లో గల సీసీటీసీ ఫ్యూటేజ్ లు తెప్పించుకొని డేటా పరిశీలిస్తుంది. ఈ సమయంలో పీకే గాని ప్రయాణం చేసినట్టు రుజువు అయితే తృణమూల్ కి రాజకీయ వ్యూహాలు వేయకుండా అడ్డుకోవడంలో బీజేపీ సక్సెస్ అయినట్టే. అంతే కాదు ఈ కేసు వల్ల పీకే ఊచలు లెక్కపెట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది కదా అస్సలు రాజకీయం అంటే..!



































