Mogulayya: నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన మొగులయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన తండ్రి తాతల నుంచి వారసత్వంగా వస్తున్న 12 మెట్ల కిన్నెర వాయిద్యం వాయిస్తూ జీవనం సాగిస్తున్న మొగులయ్యను తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలోనే ఈయన గురించి తెలుసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈయనకు తాను నటిస్తున్న భీమ్లా నాయక్ చిత్రంలో పాట పాడే అవకాశం కల్పించారు.

ఈ క్రమంలోనే ఈయన భీమ్లా నాయక్ సినిమాలో టైటిల్ సాంగ్ ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. “ఆడా లేడు మియా సాబ్… ఈడా లేడు మియా సాబ్”అనే పాటను రామజోగయ్య శాస్త్రి మార్పులు చేసి ఈ పాట సహజత్వాన్ని కోల్పోకుండా ఆడా గాదు ఈడా గాదు.. అమీరోళ్ళ మేడా గాదు అని మొగలయ్యాతోనే పాడించారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మొదలయ్యే ఈ పాట గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ గారు పి. ఏ వచ్చి మిమ్మల్ని పవన్ కళ్యాణ్ సార్ కలవాలి అనుకుంటున్నారని చెప్పారు. ఇక ఆయనతో ఫోన్లో మాట్లాడగానే మరుసటిరోజు కలిసాను. ఇలా కలిసిన వెంటనే ఆయనతో మాట్లాడిన అనంతరం నా పాట పాడి వినిపించారు.
తల్లి తండ్రి పేరు మార్చమని చెప్పారు…
ఇలా ఈ పాటను వినిపించిన తర్వాత అంతా బాగుంది పేర్లను మాత్రమే మార్చాలి అని చెప్పారు. భీమ్లానాయక్ పాటలో తల్లి తండ్రి పేరు మార్చమని చెప్పారు. ఇందులో తల్లి పేరు మీరాబాయ్.. తండ్రి పేరు భీమ్లా నాయక్. అయితే నా పాటలో తల్లి పేరు ఆశాబీనీ తండ్రి పేరు బందేర్ సాబ్ ఉంది. ఈ రెండు పేర్లను మార్చమని చెప్పారు. అలా ఈ పాటను పాడే అవకాశాన్ని తనకు కల్పించారని మొగులయ్య ఒక ఇంటర్వ్యూలో ఈ పాట గురించి తెలిపారు.































