JC Diwakar Reddy: తాడిపత్రి మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు త్వరలోనే తన పదవికి రాజీనామా చేయబోతున్నారన్న ఉద్దేశంతో ఈయన మాట్లాడారు.

ఇక చంద్రబాబు నాయుడు తన పదవి నుంచి తప్పుకుంటే లోకేష్ ముఖ్యమంత్రి కాబోతున్నారని ఈయన వెల్లడించారు. చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నారు. అయితే ఐదు సంవత్సరాల పాటు ఏదైనా ముఖ్యమంత్రిగా కొనసాగకపోవచ్చు అంటూ ఈయన తెలియజేశారు.
ఇక ఈయన దేశ రాజకీయాలపై ఆసక్తి చూపుతారా లేకపోతే పదవికి రాజీనామా చేస్తారా తెలియదు కానీ ఈయన మాత్రం ఐదు సంవత్సరాలు సీఎంగా కొనసాగలేరని తర్వాత తన కొడుకు నారా లోకేష్ ను ముఖ్యమంత్రి చేస్తారని దివాకర్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు తనంతట తాను పదవి నుంచి తప్పుకోవాలి కానీ ఆయనని ఎవరూ కూడా అధికార పీఠం నుంచి దింపలేరని జెసి దివాకర్ రెడ్డి వెల్లడించారు.
లోకేష్ సీఎం..
చంద్రబాబు ఆలోచన పరుడని, ప్రజలకు, రాష్ట్రానికి అన్యాయం చేయడని పేర్కొన్నారు. రాష్ట్రం గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారని జేసీ దివాకర్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఐదు సంవత్సరాల కాలంలో రెండున్నర సంవత్సరం చంద్రబాబు నాయుడు రెండున్నర సంవత్సరం లోకేష్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారా అనేది తెలియాల్సి ఉంది.





























