సూపర్ స్టార్ మహేష్ బాబుకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా వెండితెరకు పరిచయమైన మహేష్ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలనడిగానే ఎంతో ఫేమ్ తెచ్చుకున్నాడు.

ఇక తన రాబోయే చిత్రం ‘సర్కారు వారి పాట’తో సినీ ప్రేమికులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రం గీతా గోవింద ఫేమ్ దర్శకుడు పరశురాం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత మహేష్ వరుసగా.. డైరెక్టర్లు త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళితో చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక అతడు మోకాలి శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఉన్నందున.. ఈ సినిమాకు రెండు నెలల విరామం తీసుకున్నాడు.
ఈ వైద్యం కోసం అతడు యూఎస్ వెళ్లనున్నారు. ప్రస్తుతం ఈ విరామ సమయాన్ని అతడు తన కూతురు సితారా, కొడుకు గౌతమ్, అతడి భార్య నమ్రతా శిరోద్కర్తో కలిసి తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల అతడు విలేకురులతో మాట్లాడుతూ.. తన కూతరు సితారకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు.
తనకు సంబంధించి ఏ సినిమా అయినా అతడు తన ఫ్యామిలీతోనే కలిసి చూస్తాడట. ఆ సమయంలో సినిమాలో ఫైట్ సన్నివేశాలు వచ్చాయంటే.. తన కూతరు అక్కడ నుంచి వెళ్లి పోతుందని.. ఆ సన్నివేశాలు అంటే తనకు ఇష్టం ఉండదని చెప్పుకొచ్చాడు. కానీ తన సినిమాలను బాగా ఎంజాయ్ చేస్తారన్నారు.
విడుదలైన మొదటి రోజు ఇంట్లోనే చూస్తాం.. అదో అద్భుతమైన అనుభవం అన్నారు. సినిమాలో అంత వరకు పడిన కష్టం వాళ్లతో కలిసి అలా చూసినప్పుడు పోతుందని అన్నారు.


































