Aamani – Roja: ఆమని ,రోజా 90 లలో వీరిద్దరూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు గా కొనసాగుతున్నారు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో జగపతి బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం శుభలగ్నం. ఈ సినిమాలో డబ్బు కోసం ఆమని తన భర్తను రోజాకు అమ్ముతుంది. ఈ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. అయితే తన తప్పు తెలుసుకున్న ఆమని చివరికి తన భర్త కావాలని గొడవ చేస్తుంది.

అయితే ఈ సినిమాలో మాదిరిగానే ఆమని రోజా పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన వీరిద్దరిలో ఆమని పలు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను సందడి చేయగా రోజా రాజకీయాల్లోనూ అలాగే జబర్దస్త్ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ వారం ప్రసారం కాబోయే ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నటి ఆమని వచ్చారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఆమని రోజా ఇద్దరు యాంకర్ రష్మీ తో కలిసి డాన్స్ చేస్తూ వేదిక పైకి వచ్చారు.
ఇప్పుడు ఆ సమస్య అసలు లేదు..
ఇక ఈ ప్రోమోలో భాగంగా యాంకర్ రష్మీ మాట్లాడుతూ శుభలగ్నం సినిమాలో మీ ఇద్దరికీ అస్సలు పడలేదు అదే ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తారా.. అని అడగగా ఈ ప్రశ్నకు ఆమనీ సమాధానం చెబుతూ ఇప్పుడైతే నాకు ఆ సమస్య ఏమీ లేదు… ఎందుకంటే నా మొగుడు నా దగ్గర ఉన్నాడు… తన మొగుడు తన దగ్గర ఉన్నాడు అంటూ రోజా పై కామెంట్స్ చేస్తూ పరువు మొత్తం తీశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



























