Nagababu: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేసే అత్యధిక మెజారిటీతో గెలిచిన సంగతి మనకు తెలిసిందే.ఇలా పవన్ కళ్యాణ్ గెలుపుకు అక్కడ టిడిపి ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ చాలా కృషి చేశారు. తనుకు టికెట్ రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వర్మ అనంతరం పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలియజేశారు.

ఇక పవన్ కళ్యాణ్ గెలిచిందే ఆలస్యం పిఠాపురం నియోజకవర్గంలో ఆయనకు చేదు అనుభవం ఎదురయింది ఇప్పటికే తెలుగుదేశం జనసేన కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున గొడవలు చోటు చేసుకోవడమే కాకుండా వర్మ కారుపై జనసేన కార్యకర్తలు దాడి చేసిన సంగతి కూడా మనకు తెలిసిందే.
ఇకపోతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపొందిగా అక్కడ నాగబాబు ఇటీవల పర్యటన చేసి అధికారులతో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాగబాబు మాట్లాడుతూ సమస్యలు ఉంటే పవన్ దృష్టికి లేదంటే పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్కు తీసుకెళ్లాలని సూచించారు.
నాగబాబు పెత్తనం..
ఏదైనా ఇష్యూ ఉంటే మర్రెడ్డి డీల్ చేస్తారని, మర్రెడ్డి చెప్తేనే యాక్షన్ తీసుకోవాలని.. అంతేగానీ వేరే పార్టీకి, ఆ పార్టీ నేతలకు సరెండర్ కావాలని అవసరం లేదని నాగబాబు తెలిపారు. ఇలా నాగబాబు సమావేశంతో టిడిపి శ్రేణులలో చర్చలు మొదలయ్యాయి. ఏ హోదా ఉందని ఆయన ఇక్కడ పెత్తనం చేస్తున్నారు తన తమ్ముడు గెలిస్తే ఈయన అధికారం చెలాయించడానికి వీలులేదు ఇలాంటి వాటిని మొదట్లోనే కట్ చేయకపోతే మన పార్టీకే మనుగడ ఉండదు అంటూ అక్కడ టిడిపి కార్యకర్తలు శ్రేణులు తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.





























