Naga Chaithanya : నాగ చైతన్య అక్కినేని వారసుడిగా జోష్ సినిమాతో కెరీర్ ని ప్రారంభించాడు. ‘ఏం మాయ చేసావే’ సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకున్నాడు. ఏం మాయ చేసావే సినిమా నుంచి పరిచయం అయిన సమంత, నాగ చైతన్య 2017 లో వివాహం చేసుకొని 2021 లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఇద్దరు ఎవరి కెరీర్ లో వారు బిజీగా వున్నారు. నాగచైతన్య హీరో గా వస్తున్న ‘థాంక్ యూ’ సినిమా జులై 22 నా ప్రేక్షకులకు ముందుకు రాబోతోంది. విడుదల సమయం దగ్గర ఉండటం తో ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో నాగ చైతన్య చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఆ అమ్మాయిని ప్రేమించా.. హృదయం ముక్కలు చేసింది…
‘థాంక్ యూ’ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా ఈ చిత్రంలో రాశీ ఖన్నా, అవికాగోర్, మాళవిక నాయర్ నాగ చైతన్య సరసన హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుండి విడుదల అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన రావడంతో అంచనాలు పెరిగిపోయాయి. అయితే నాగచైతన్య, రాశి ఖన్నా సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సినిమా లో నటించినదుకు కారణం గురించి ఇద్దరినీ అడుగగా… స్క్రిప్ట్ వినగానే తనలో ఒక ఫీలింగ్ వచ్చిందని.. అంతే కాకుండా తన జీవితంతలో స్పెషల్ పర్సన్స్కు థ్యాంక్స్ చెప్పాలనిపించిందని తెలిపాడు. అందుకే ఈ సినిమాలో నటించానని చెప్పుకొచ్చాడు. ఇక రాశి ఖన్నా చెప్తూ… కథ నచ్చిందని, సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఈ సినిమాకు పని చేస్తున్నందుకు తాను చేసినట్లు చెప్పింది.

అంతేకాకుండా కరోనా సమయంలో ఫోన్ ఎక్కువగా చూసేవాడిని అని రోజు లేవడం తినడం ఫోన్ చేతిలో పట్టుకొని సోషల్ మీడియా కామెంట్స్ చూడటం పనిగా వుండేదని, అపుడు లైఫ్ సోషల్ మీడియా అవ్వకూడదని అర్థమైనట్లు చెప్పాడు నాగ చైతన్య. ఇక ఫస్ట్ లవ్ గురించి అడుగగా రాశి ఖన్నా అది ఒక మంచి ఫీలింగ్ అని చెప్పగా, నాగ చైతన్య… తొమ్మిదో తరగతిలో ముగ్గురం కలసి ఒక అమ్మాయిని ప్రేమించేవాళ్ళం, కానీ ఆ అమ్మాయి అందరి హృదయాలను ముక్కలు చేసి వెళ్ళిపోయింది, కానీ మేము ముగ్గురం మంచి ఫ్రెండ్స్ అయ్యాము అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్లో వైరల్ అవుతున్నాయి.































