Pawan Kalyan: ఆంధ్రలో ఎన్నికలు మరొక ఐదు రోజులలో జరగబోతున్నటువంటి తరుణంలో ప్రచార కార్యక్రమాలు తారాస్థాయికి చేరుకున్నాయి ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పిఠాపురంలో సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి తరుణంలో ఈయనకు సినీ సెలబ్రిటీల మద్దతు భారీగా లభిస్తుంది.

ఇప్పటికే జబర్దస్త్ కమెడియన్లు మొత్తం పిఠాపురం చేరుకొని పవన్ కళ్యాణ్ కు ఓట్లు వేయాలని కోరుతున్నారు అలాగే మెగా హీరోలు కూడా పిఠాపురంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అలాగే మరి కొంతమంది దర్శకులు నిర్మాతలు కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలోని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ అధినేత సూర్యదేవర నాగవంశీ పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిచారు.
ఇటీవల విశ్వక్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మే 13వ తేదీ ఎన్నికలు జరుగుతున్నాయి మే 12వ తేదీ ఆంధ్ర వారందరూ కూడా తమ సంస్థలకు చేరుకొని 13వ తేదీ ఓటు వేయాలని తెలిపారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా జనసేన పార్టీకి ఓటు వేసి మద్దతుగా నిలవాలని కోరారు అదే ఆయనకు మనం ఇచ్చే గొప్ప సేవ అని తెలిపారు.
అదే గొప్ప సేవ..
ఆంధ్రాలో ఓటు హక్కు ఉన్నటువంటి తెలుగు వాళ్ళు హైదరాబాద్లో చాలామంది ఉన్నారు. అందుకే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈయన కోరారు. మీ ఒక్క ఓటు గెలుపోటములపై తప్పనిసరిగా ప్రభావం చూపుతాయని ఈ సందర్భంగా నాగ వంశీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.





























