Nallamala Movie: అమిత్ తివారీ.. టాలీవుడ్ తో పాటు పలు సినీ ఇండస్ట్రీల్లో విలన్ గా నటించాడు. అమిత్ తివారీ పేరు చెప్పిగానే గుర్తుకు వచ్చే సినిమా విక్రమార్కుడు.. పూర్తిగా నెగిటివ్ క్యారెక్టర్లు చేస్తున్ అమిత్ తివారీ తొలిసారిగా హీరోగా నటిస్తున్న సినిమా ‘నల్లమల’.

భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం నల్లమల. ఈ చిత్రం ద్వారా రవి చరణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆర్.ఎమ్ నిర్మిస్తున్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను శనివారం నిర్వహించారు.

అ సినిమా ట్రైలర్ లాంచ్ కు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. నల్లమల పేరు చెప్పగానే ‘ఏమున్నవే పిల్ల ఏమున్నవే’ సాంగ్ గుర్తుకు వచ్చిందని అన్నారు. సినిమా ఇండస్ట్రలో సక్సెస్ పర్సెంటేజ్ చాలా తక్కువ అని.. కొత్తగా సినిమా రంగంలోకి వచ్చే వారికి ఇది మరింత తక్కువగా ఉంటుందని.. మనం ఎక్కడ సక్సెస్ అవుతామో చూసుకోని సినిమా చేయాలని.. దిల్ రాజు అన్నారు.
మూడేళ్లు కష్టపడ్డాం అని ..
దర్శకుడు రవి చరణ్ మాట్లాడుతూ.. నిర్మాత దూరంగా ఉన్నా.. మమ్మల్ని నమ్మాడని అందుకే సినిమాను చాలా బాగా తీశాం అన్నారు. ముందుగా మా హీరో.. త్రివిక్రమ్ దగ్గరికి తీసుకెళ్లారని ఆయన పాట బాగా వచ్చింది. సినిమా కూడా బాగా తీయండి అంటూ.. ఆశీర్వదించారు. రాఘవేంద్ర రావు, నాజర్ వంటి ప్రముఖుల సినిమా బాగుందని మెచ్చుకున్నారని అన్నారు. హీరో అమిత్ తివారీ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డాం అని అన్నారు. ‘నాకు ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది. మూడేళ్లు కష్టపడ్డాం. ఈ రోజు ట్రైలర్ విడుదలైంది. నాకు ఎంతో సంతోషంగా ఉంది. దిల్ రాజు గారు ఇక్కడకు వచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు. ఆయన బ్యారెర్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశా అని.. తాజాగా తాను హీరోగా వస్తున్న నల్లమల సినిమా ట్రైలర్ లాంఛ్ కు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపాడు. ఈసినిమాలో అమిత్ తివారి, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాశీ విశ్వనాథ్, కాలకేయ ప్రభాకర్, ఛలాకీ చంటి, శుభోదయం రాజశేఖర్, చత్రపతి శేఖర్, ముక్కు అవినాష్, శేఖర్ అలీ, అరోహి నాయుడు, అసిరి శ్రీను నటించారు.






























