Natti Kumar : తెలుగు సినిమా డైరెక్టర్, మరియు ప్రొడ్యూసర్ అయిన నట్టి కుమార్ తాజాగా జబర్దస్త్ ఇష్యూ మీద మాట్లాడారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డిని దగ్గర నుండి చూసాను, తాను ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. మల్లెమాల సంస్థ నుండి భారీ బడ్జెట్ చిత్రాలను తీశారు. శ్యామ్ మాజీ సీఎం విజయ భాస్కర్ రెడ్డి అల్లుడు, అలాగే ఎమ్ఎస్ రెడ్డి గారి కొడుకు అయినా కూడా ఆయనలో గర్వం ఉండదు.

జబర్దస్త్ లో ఉన్నప్పుడే ఆ ఆరోపణలు చేసుంటే దానికి విలువ ఉండేది…
జబర్దస్త్ నుండి వెళ్లిపోయిన సంవత్సరం తరువాత జబర్దస్త్ లో తిండి బాగోలేదు, అక్కడ మనుషులను గౌరవించరు అంటే ఇలా ఎవరు నమ్ముతారు. పైగా ఇలాంటి విషయాలను సంస్థలోనే చర్చించుకోవాలి కానీ ఇలా బయటకు వచ్చి చెబితే ఏం లాభం అంటూ నట్టి కుమార్ అభిప్రాయ పడ్డారు. ఎన్నో ఏళ్ల నుండి ఉన్న సంస్థ, అదీ కాక కాంట్రవర్సీకి దూరంగా ఉండే శ్యామ్ ప్రసాద్ గురించి ఇలాంటి వాఖ్యలు కరెక్ట్ కాదు. శ్యామ్ ప్రసాద్ ను దగ్గరగా చూసిన వారెవరూ కిర్రాక్ ఆర్పి వాఖ్యలను నమ్మరు అంటూ చెప్పాడు.

ఇక నాగబాబు గారు సహాయం చేస్తారు శ్యామ్ ప్రసాద్ పట్టించుకోరు అని ఆరోపణలకు నట్టి సమాధానం ఇచ్చారు. నువ్వు చేస్తున్న పనికి నీకు జీతం వచ్చిందా, కరెక్ట్ గా వస్తోందా లేదా అన్నదే పాయింట్. నాగబాబు కి డబ్బులెక్కువ ఉండి అవి ఊరికే ఇస్తే అదే పని శ్యామ్ ప్రసాద్ ఎందుకు చేయాలి. నీకు జీతం సరిగా ఇవ్వకపోయుంటే నువ్వు ఆరోపించాలి కానీ మిగతా విషయాలు ఎందుకు అంటూ నట్టి కుమార్ అభిప్రాయ పడ్డారు.































