Navadeep: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల ఫలితాలు ఒక ఎత్తు అయితే మరోవైపు బెంగళూరు రేవ్ పార్టీ కూడా అదే స్థాయిలో ఆసక్తిని కల్పిస్తుంది. ఇటీవల ఓ ప్రముఖ వ్యాపారవేత పుట్టినరోజు సందర్భంగా బెంగళూరులోని ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు అయితే ఇందులో భాగంగా ఎంతోమంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులు ఉండటంతో ఈ విషయం కాస్త సంచలనం గా మారింది.

ఇక ఈ పార్టీలో భాగంగా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉన్నారంటూ కొందరి పేర్లను కర్ణాటక పోలీసులు కూడా వెల్లడించారు. ఇందులో నటి హేమ కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. అయితే తాజాగా ఈ పార్టీ గురించి నవదీప్ స్పందించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా కూడా పార్టీలు అన్నా, డ్రగ్స్ కేసులు అన్న మొదట వెలుగులోకి వచ్చేది నటుడు నవదీప్ పేరే.ఎక్కడ ఏ డ్రగ్ కేసులో విచారణ జరిగిన సినీ ఇండస్ట్రీ నుండి అటెండెన్స్ వేయించుకునే మొదటి వ్యక్తి ఆయనే. ఇదివరకు పోలీసులు అనేకమార్లు నవదీప్ ను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ పేరిట విచారణ జరిపిన సంఘటనలు ఉన్నాయి.
మొదటిసారి నా పేరు లేదు..
ఇక మీడియా కూడా ఈయనని టార్గెట్ చేసేదని చెప్పాలి అయితే మొదటిసారి బెంగుళూరులో జరిగినటువంటి ఈ రేవ్ పార్టీలో మీడియా వారు గానీ పోలీసులు కానీ తన పేరును ప్రస్తావించకపోవడంతో చాలా సంతోషం వ్యక్తం చేశారు.ఇన్నాళ్లకు మీడియా తనని వదిలి పెట్టిందంటూ సంతోషపడుతూ మాట్లాడాడు. అలాగే తాను బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్లినట్టు రూమర్స్ రాక పోవడంతో చాలా మంది నిరుత్సాహపడి ఉంటారని కాస్త సెటైర్ గా మాట్లాడాడు. కొందరు ఏంటన్న ఈ ఫేక్ న్యూస్ లో మీరు లేరా అంటూ నన్ను ప్రశ్నిస్తున్నారని ఈ సందర్భంగా నవదీప్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.



























