ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం వైపుగా కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టింది. ఈ నెల 11 నుంచి ఏపీ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ వరుస భేటీలు జరపనున్నారు. ముందుగా ఏపీ సీనియర్ నేతలతో సమాలోచనలు జరపనున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నుంచి కూడా రాష్ట్ర నేతలకు అహ్వనం అందింది. ఏపీలో స్తబ్ధుగా ఉన్న పార్టీని క్రీయశీలకం చేయడం ఏం చేయాలనే దానిపై నేతల అభిప్రాయం సేకరించనున్నారు రాహుల్ గాంధీ. అలాగే ఏపీ పీసీసీ నూతన అధ్యక్షుడు నియామకంపై కూడా రాహుల్ చర్చలు జరపనున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓ వెలుగు.. వెలిగిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తన ప్రభావాన్ని కోల్పోయింది.. ఇన్నాళ్ళు మాజీ మంత్రి రఘువీరారెడ్డి పార్టీ పగ్గాలు తీసుకుని బండిని లాక్కొచ్చారు. ప్రస్తుతం శైలజానాథ్ ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏపీలో పార్టీని లైమ్ లైట్లోకి తీసుకరావడంపై ఏం చేయాలని దానిపై పార్టీ అధిష్టానం దృష్టిసారించింది.



































