Niharika: నిహారిక నిర్మాతగా మారి కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇటీవల టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా నిహారిక మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఆమెకు మీడియా నుంచి వివిధ రకాలుగా ప్రశ్నలు ఎదురయ్యాయి.

ముఖ్యంగా ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత మెగా వెర్సెస్ అల్లు అనే విధంగా ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు అనుగుణంగానే మెగా సంబరాలలో కానీ పవన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కానీ అల్లు కుటుంబ సభ్యులు ఎవరు పాల్గొనలేదు.
ఇకపోతే మెగా హీరో అయినటువంటి సాయిధరమ్ తేజ్ అల్లు అర్జున్ తో పాటు ఆయన భార్య స్నేహారెడ్డిని కూడా సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా సోషల్ మీడియాలో ఈయన అన్ ఫాలో కావడంతో ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయని స్పష్టంగా అర్థమైంది. ఈ క్రమంలోనే మీడియా వారు తేజ్ బన్నీని అన్ ఫాలో చేయడం గురించి ప్రశ్నించారు.
అవునా.. నిజమా
మీడియా వారి నుంచి ఇలాంటి ప్రశ్న ఎదురు కావడంతో నిహారిక స్పందిస్తూ అవునా నిజమా మీరు చెప్పే వరకు నాకు అసలు తెలియదు అంటూ తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకున్నారు అలాగే అన్ ఫాలో చేసి ఉంటారంటే ఎవరి రీజన్స్ వారికి ఉంటాయి కదా అంటూ ఈమె ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పకనే చెప్పేశారు.. ప్రస్తుతం నిహారిక చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.



























